Home » News » The Husband Spent Lakhs And Educated His Wife
News

Husband : లక్షలు ఖర్చుపెట్టి భార్యని చదివించిన భర్త.. చివరికి ఊహించని షాక్ ..!

Authored By
aruna
The Telugu News | Published on: July 10, 2023, 9:00 pm
Advertisement

Husband  : ప్రస్తుత కాలం ఎలా ఉందంటే భార్య భర్తల బంధం కూడా బోనాల ముచ్చట లాగానే ఉంటుంది. పెళ్లయిన కొద్దిరోజులకి విడాకులు తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది భార్యలు భర్తలను మోసం చేసి తమ దారి వాళ్ల దారి వాళ్లు చూసుకుంటున్నారు. చట్టాలను ఆసరా చేసుకోను కొంతమంది భార్యలు భర్తలను చిత్రహింసకు గురిచేస్తున్నారు. భార్య ఏమైనా అంటే ఎక్కడ తను కూడా ఇస్తుందో అని తనను వదిలి వెళ్ళిపోతుదో అని కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నారు. ఇక భార్యను ఇస్తాను గురించి కొంతమంది భర్తలు ఆమె ఉన్నత చదువులకు సహకరిస్తున్నారు. ఇటీవల మౌర్య జ్యోతిల కథ ఇలానే ఉంటుంది.

Advertisement

ప్రభుత్వ ఉద్యోగం చేయడం తన కల అని చెప్పిన భార్యకు భర్త ప్రోత్సాహంతో ఆమె మెజిస్ట్రేట్గా ఎంపిక అయింది. ఆ తర్వాత వేరే కోరితో వివాహేతర సంబంధం పెట్టుకొని , వరకట్న వేధింపుల కేసులు భర్త ఇరికించి. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాన్పూరుకు చెందిన అర్జున్ సింగ్, సవిత మౌర్య భార్యా భర్తలు. వీరికి 2017లో పెళ్లి జరిగింది. భార్య కష్టాన్ని, చదువు పట్ల ఆమెకున్న ఇష్టాన్ని గుర్తించిన భర్త భార్యను నర్సింగ్ చదివించాడు. దాని కోసం అప్పులు కూడా చేశాడు.

The husband spent lakhs and educated his wife

Advertisement

చదువు పూర్తి అయ్యాక ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. రెండు మూడు నెలలు ఉద్యోగం చేసే సరికి సవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి భర్తను దూరం పెట్టడం మొదలు పెట్టింది. వేరే గదిలో పడుకోవడం మొదలు పెట్టే సరికి భర్త అడగటంతో నల్లగా, పొట్టిగా ఉన్నావని, నీలాంటి వ్యక్తితో కాపురం చేయలేని అనే సరికి అర్జున్ ఒక్కసారిగా షాక్ ఆయ్యాడు. భర్త నుండి విడాకులు కావాలంటూ ఆమె దరఖాస్తు చేసింది. అయితే తనకు భార్య కావాలంటూ అర్జున్ పోరాడుతున్నారు. ఆమె చదువు కోసం 6 నుండి 7 లక్షలు ఖర్చు పెట్టానని, కూలీ పనులు చేస్తూ అప్పును తీరుస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు న్యాయం జరగాలంటూ వేడుకుంటున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి