Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Authored By Sam C | The Telugu News | Updated on : 9 November 2025, 6:30 am

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం రాశి పరివర్తనం చేస్తాడు. ఆ సమయంలో మూడు రాశులపై దీని ప్రభావం అత్యంత గట్టిగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రభావం మీన రాశి వారికి ఎక్కువగా ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

#image_title

మీన రాశిపై ఏలినాటి శని ప్రభావం

శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడంతో 2025లో మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ దశ కొనసాగుతోంది. ఈ దశలో శని ప్రభావం అత్యధికంగా ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. శని ప్రభావం ఒక రాశిపై మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది మూడు దశలుగా విభజించబడుతుంది — మొదటి, రెండో, మూడో దశలుగా.

కుంభ రాశిలో చివరి దశ కొనసాగుతుండగా, మీన రాశి వారు ఇప్పుడు రెండో దశలో ఉన్నారు. ఈ ప్రభావం 2029 వరకు, అంటే శని గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు కొనసాగుతుందని చెబుతున్నారు.

రెండో దశలో తలెత్తే సమస్యలు

పండితుల ప్రకారం, ఈ రెండో దశలో మీన రాశి వారు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏ పని చేసినా అనుకున్న ఫలితం రాకపోవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టాలు సంభవించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శాస్త్రోక్తంగా కొన్ని పూజలు, దానాలు చేయాలని పండితులు సలహా ఇస్తున్నారు.ప్రతి శనివారం ఉదయం, నల్ల నువ్వులు, మినపప్పు, ఆవాల నూనె లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. శని దేవుడి ఆలయంలో దీపం వెలిగించడం, హనుమాన్ చలీసా పారాయణం చేయడం శుభప్రదమని చెబుతున్నారు.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి