Ysrcp : ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్ల పోలింగ్ పూర్తి అయ్యింది. హోరా హోరీగా సాగిన పోరులో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలపై చాలా నమ్మకం పెట్టుకున్న టీడీపీ మరియు బీజేపీలకు చేదు అనుభవం తప్పదని ముందుగానే వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. ఈ ఎన్నికలు ఏక పక్షంగా సాగాయని తప్పకుండా ఇందులో టీడీపీ మరియు బీజేపీపై వైకాపా అభ్యర్థి గురు మూర్తి ఘన విజయం సాధించడం ఖాయం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితనంకు ఓటర్లు ఇవ్వబోతున్న తీర్పు అంటూ వైకాపా నాయకులు నమ్మకంగా చెబుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా తెలుగు దేశం మరియు బీజేపీ నాయకులు దొంగ ఓటర్లను పట్టుకోవడం జరిగింది. కొందరు మీడియా వర్గాల వారు కూడా దొంగ ఓటర్లను గుర్తించారు. ఓటరు కార్డుపై ఉన్న అడ్రస్ ను తండ్రి పేరును చెప్పలేక పోయిన వారు దొంగ ఓటర్లు కాకుండా ఎవరు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్న వైకాపా గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న వైకాపా ఎందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం దొంగ ఓట్ల పై ఆధారపడింది అంటూ బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. గెలుపు పై నమ్మకం లేకపోవడం వల్లే వారు ఈ పని చేశారనే ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు.
వైకాపా ఖచ్చితంగా తిరుపతిలో గెలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ ఖచ్చితంగా 5 లక్షలు ఉండాల్సిందే అంటూ వైకాపా నాయకులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించాడు. మెజార్టీ తగ్గితే ఖచ్చితంగా శిక్ష తప్పదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక వైకాపా నాయకులు ఈ పని చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ దొంగ ఓట్లకు సంబంధం లేదు అనేది కొందరి వాదన. అయినా ఎక్కడ కూడా దొంగ ఓట్లు అనేవి పడలేదు అనేది ఎలక్షన్ కమీషన్ వాదన.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.