Ysrcp
Ysrcp : ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్ల పోలింగ్ పూర్తి అయ్యింది. హోరా హోరీగా సాగిన పోరులో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలపై చాలా నమ్మకం పెట్టుకున్న టీడీపీ మరియు బీజేపీలకు చేదు అనుభవం తప్పదని ముందుగానే వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. ఈ ఎన్నికలు ఏక పక్షంగా సాగాయని తప్పకుండా ఇందులో టీడీపీ మరియు బీజేపీపై వైకాపా అభ్యర్థి గురు మూర్తి ఘన విజయం సాధించడం ఖాయం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితనంకు ఓటర్లు ఇవ్వబోతున్న తీర్పు అంటూ వైకాపా నాయకులు నమ్మకంగా చెబుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా తెలుగు దేశం మరియు బీజేపీ నాయకులు దొంగ ఓటర్లను పట్టుకోవడం జరిగింది. కొందరు మీడియా వర్గాల వారు కూడా దొంగ ఓటర్లను గుర్తించారు. ఓటరు కార్డుపై ఉన్న అడ్రస్ ను తండ్రి పేరును చెప్పలేక పోయిన వారు దొంగ ఓటర్లు కాకుండా ఎవరు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్న వైకాపా గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న వైకాపా ఎందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం దొంగ ఓట్ల పై ఆధారపడింది అంటూ బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. గెలుపు పై నమ్మకం లేకపోవడం వల్లే వారు ఈ పని చేశారనే ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు.
Ysrcp
వైకాపా ఖచ్చితంగా తిరుపతిలో గెలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ ఖచ్చితంగా 5 లక్షలు ఉండాల్సిందే అంటూ వైకాపా నాయకులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించాడు. మెజార్టీ తగ్గితే ఖచ్చితంగా శిక్ష తప్పదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక వైకాపా నాయకులు ఈ పని చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ దొంగ ఓట్లకు సంబంధం లేదు అనేది కొందరి వాదన. అయినా ఎక్కడ కూడా దొంగ ఓట్లు అనేవి పడలేదు అనేది ఎలక్షన్ కమీషన్ వాదన.
Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
This website uses cookies.