Today Covid Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2 రోజుల్లో రెట్టింపు కేసులు.. 268 మంది మృత్యువాత..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Covid Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2 రోజుల్లో రెట్టింపు కేసులు.. 268 మంది మృత్యువాత..!

Today Covid Cases : భారత్‌లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాప్తి చెందుతోంది. గడిచిన రెండు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది మృత్యువాతపడ్డారు. కాగా ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778గా ఉంది. కరోనాతో ఇప్పటివరకు 4,80,860 మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,43,83,22,742గా ఉంది. రెండు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2021,7:28 pm

Today Covid Cases : భారత్‌లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాప్తి చెందుతోంది. గడిచిన రెండు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది మృత్యువాతపడ్డారు.

కాగా ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778గా ఉంది. కరోనాతో ఇప్పటివరకు 4,80,860 మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,43,83,22,742గా ఉంది. రెండు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల పైనే నమోదవుతోంది.

Today covid cases in india

Today covid cases in india

మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 961 కేసులు నమోదవ్వగా.. ఆ బాధితుల్లో ఇప్పటి వరకు 320 మంది కోలుకున్నారు. అధికంగా ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ మంది బాధితులున్నారు. అయితే ఒమిక్రాన్ బారినపడి ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది