today news Kidnappers in madhya pradesh jan 22
Kidnappers : సమాజంలో జరిగే రకరకాల మోసాలలో కిడ్నాపర్స్ చాలా తెలివిగా మోసం చేస్తారు. ఇంటిలో పిల్లాడినా లేదా భార్యను గాని.. ఇంకా కిడ్నాప్ చేయబడే కుటుంబానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు అడగటం స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా ధనవంతుల కుటుంబాలలో పిల్లలను ఎత్తుకెళ్లి కిడ్నాపర్లు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయటం మనం చూస్తూనే ఉంటాం. ఈ రీతిలో బాధ్యత కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించి వారి దగ్గర నుండి తమ కుటుంబ సభ్యులను ప్రాణాలతో కాపాడుకుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఓ కిడ్నాప్ ఊదాంతం సంచలనంగా మారింది. కిడ్నాపర్లకి డబ్బులు చెల్లించడానికి ఓ గ్రామం అంతా చందాలు వేసుకోవడం జరిగింది.
మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది..? ఆ ఊరంతా ఎందుకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అన్న విషయం గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో శ్యోపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్ లోని ఓ నేరస్థుల ముఠా కిడ్నాప్ చేయటం జరిగింది. తమకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తేనే వారిని ప్రాణాలతో విడిచిపెడతానని కిడ్నాపర్లు తెలియజేశారు. అయితే ఎక్కడ విషయం ఏమిటంటే కిడ్నాప్ కీ గురైన ముగ్గురు వ్యక్తులు కూడా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. దీంతో తమ కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకోవాలో.. దిక్కుతోచని పరిస్థితుల్లో సదరు కుటుంబ సభ్యులు ఉన్నారు.
today news Kidnappers in madhya pradesh jan 22
దీంతో ఈ విషయం గ్రామస్తులంతా తెలుసుకొని కిడ్నాపర్లు అడిగిన 15 లక్షల రూపాయలు చెల్లించడానికి వివిధ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఊరంతా చాటించి.. గ్రామ పెద్దలు మొత్తం 15 లక్షల రూపాయలు చెల్లించారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే… ఊరిలో ఇల్లు వాకిలి లేకపోయినా గాని నిరుపేద కుటుంబ సభ్యులు 100 లేదా 200 ఇంకా 500 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా సదరు గ్రామస్తులంతా… గ్రామ మాజీ సర్పంచ్ సియారాం కి డబ్బులు అందించారు. ఇక ఇదే సమయంలో కిడ్నాపర్లను పట్టుకోవడానికి రాజస్థాన్ పోలీసులు రంగంలోకి దిగారు.
అంత మాత్రమే కాదు కిడ్నాపర్లపై రిపోర్టు కూడా ప్రకటించడం జరిగింది. వారి ఆచూకీ తెలిపిన వారికి 30 వేల రూపాయలు ఇస్తామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. శ్యోపూర్ జిల్లా… రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు గ్రామం. ఇక్కడ చాలా కిడ్నాప్ కేసులు చోటు చేసుకున్నాయి. వరుస కిడ్నాప్ ఘటనలు స్థానికులకు కలవరం పెడుతూ ఉంది. దీంతో పోలీసులు ప్రత్యేకమైన మెగా పెట్టినా కానీ కిడ్నాపర్లు…శ్యోపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేయటం సంచలనం సృష్టించింది.
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
This website uses cookies.