UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

 Authored By sandeep | The Telugu News | Updated on :10 September 2025,2:00 pm

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన ఈ ఇంటర్‌ఫేస్‌ 2016లో లాంఛ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దూసుకుపోతుంది. తాజాగా, 2025 ఆగస్టు నెలలో ఈ వ్యవస్థ ఆల్‌టైమ్ హైకి చేరింది.

#image_title

ట్రాన్సాక్షన్ల సంఖ్య, విలువ – రెండింట్లోనూ బిగ్ బ్లాస్ట్

ఆగస్టు 2025లో జరిగిన యూపీఐ లావాదేవీలు 20 బిలియన్లకు (2,000 కోట్లు) చేరాయి. ఇదే కాదు, మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ కూడా రూ. 24.85 లక్షల కోట్లు దాటి చరిత్ర సృష్టించింది. ఇది యూపీఐ చరిత్రలో ఒక్క నెలలో నమోదైన గరిష్ఠం. నిరంతరం మారుతున్న యూపీఐ యాప్‌ల పోటీలో ఫోన్ పే మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఫోన్ పే:

ట్రాన్సాక్షన్లు: 960 కోట్లకు పైగా

మార్కెట్ షేర్ (వాల్యూ పరంగా): 48.64%

విలువ: రూ. 12 లక్షల కోట్లకు పైగా

గూగుల్ పే:

ట్రాన్సాక్షన్లు: 740 కోట్లకు పైగా

మార్కెట్ షేర్: 35.53%

విలువ: రూ. 8.83 లక్షల కోట్లు

పేటీఎం:

మార్కెట్ షేర్:  8.5% కి తగ్గింది

వినియోగం కాస్త తగ్గుదలకు గురైంది

ఇతర యాప్‌ల్లో నవీ, క్రెడ్ వంటి వాటి మార్కెట్ షేర్ తక్కువగా ఉన్నప్పటికీ, వాటి వినియోగం స్థిరంగా కొనసాగుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది