chandrababu to meet congress chief kharge to join in jodo yatra
YS Jagan – Chandrababu : ఇప్పటికే ఒకసారి ఏపీ ప్రజలు మనకు చాన్స్ ఇచ్చారు. ఇంకోసారి చాన్స్ ఇస్తే ఇక వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం. ఏపీలో మనమే అధికారంలో ఉంటాం అని అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవల వైజాగ్ లో జరిగిన నార్త్ నియోజకవర్గం కార్యకర్తల భేటీలో మాట్లాడిన జగన్ అన్నమాటలు అవి. ఆయన ఏదో వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు.. వచ్చే 30 ఏళ్లు ఏపీలో మనమే అధికారంలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. కార్యకర్తలతో అదే విషయాన్ని నొక్కి చెప్పారు. దాని కోసం నేతలు, కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే అది సుసాధ్యం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175. ఖచ్చితంగా 175 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.
ఏ నేతతో మాట్లాడినా.. ఎంతమంది కార్యకర్తలతో డిస్కస్ చేసినా.. వచ్చే 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని చెప్పుకొస్తున్నారు. అయితే.. వచ్చే 30 ఏళ్లు తామే అధికారంలో ఉండాలని అనుకోగానే అయిపోతుందా? జనాల్లో అది ఉండాలి కదా. తమ రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ.. పార్టీల నాయకులు కాదు కదా. జనాలు మెచ్చితే 30 ఏళ్లు ఏంటి.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు. అలాంటి వాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు.
what is the difference between chandrababu and ys jagan
నిజానికి సంక్షేమ పథకాల విషయంలో చాలామంది పొరపడేది అదే. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. జనాలు తమకు ఓట్లేస్తారని అందరూ అనుకుంటారు. సీఎం జగన్ కూడా అదే పొరపాటు పడుతున్నారా? కేవలం సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. మౌలిక సదుపాయాలు కల్పించనక్కర్లేదా. రోడ్లు సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదా? మరి.. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం మరిచిపోయిందా? ఇటువంటి వాటిపై కూడా సీఎం జగన్ కాస్త దృష్టి పెట్టాలని అంటున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే 30 ఏళ్లు కాదు.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు అంటున్నారు. చూద్దాం మరి.. సీఎం జగన్ ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీదనే కాకుండా అన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారో?
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.