chandrababu to meet congress chief kharge to join in jodo yatra
YS Jagan – Chandrababu : ఇప్పటికే ఒకసారి ఏపీ ప్రజలు మనకు చాన్స్ ఇచ్చారు. ఇంకోసారి చాన్స్ ఇస్తే ఇక వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం. ఏపీలో మనమే అధికారంలో ఉంటాం అని అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇటీవల వైజాగ్ లో జరిగిన నార్త్ నియోజకవర్గం కార్యకర్తల భేటీలో మాట్లాడిన జగన్ అన్నమాటలు అవి. ఆయన ఏదో వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు.. వచ్చే 30 ఏళ్లు ఏపీలో మనమే అధికారంలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. కార్యకర్తలతో అదే విషయాన్ని నొక్కి చెప్పారు. దాని కోసం నేతలు, కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే అది సుసాధ్యం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175. ఖచ్చితంగా 175 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.
ఏ నేతతో మాట్లాడినా.. ఎంతమంది కార్యకర్తలతో డిస్కస్ చేసినా.. వచ్చే 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని చెప్పుకొస్తున్నారు. అయితే.. వచ్చే 30 ఏళ్లు తామే అధికారంలో ఉండాలని అనుకోగానే అయిపోతుందా? జనాల్లో అది ఉండాలి కదా. తమ రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ.. పార్టీల నాయకులు కాదు కదా. జనాలు మెచ్చితే 30 ఏళ్లు ఏంటి.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు. అలాంటి వాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు.
what is the difference between chandrababu and ys jagan
నిజానికి సంక్షేమ పథకాల విషయంలో చాలామంది పొరపడేది అదే. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. జనాలు తమకు ఓట్లేస్తారని అందరూ అనుకుంటారు. సీఎం జగన్ కూడా అదే పొరపాటు పడుతున్నారా? కేవలం సంక్షేమ పథకాలు అందిస్తే చాలు.. మౌలిక సదుపాయాలు కల్పించనక్కర్లేదా. రోడ్లు సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదా? మరి.. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం మరిచిపోయిందా? ఇటువంటి వాటిపై కూడా సీఎం జగన్ కాస్త దృష్టి పెట్టాలని అంటున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే 30 ఏళ్లు కాదు.. ఎన్ని దశాబ్దాలు అయినా పాలించవచ్చు అంటున్నారు. చూద్దాం మరి.. సీఎం జగన్ ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీదనే కాకుండా అన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారో?
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.