Post Mortem : పోస్టుమార్టం… ఈ పదాన్ని మనం ఏదో ఒక టైంలో వినే ఉంటాం. అసలు పోస్టుమార్టం అంటే ఏమిటి? దీనిని ఎందుకు చేస్తారు? దీనిని చేసే అధికారం ఎవరికి ఉంది? వద్దనే అధికారం ఎవరికి ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.. పోస్టు మార్టం అంటే మృతి తర్వాత అని అర్థం. వాస్తవానికి దీనిని పోస్టుమార్టం పరీక్ష అని పిలవాలి. కానీ చాలా మంది షార్ట్ కట్లో పోస్టుమార్టం అని పిలుస్తూ ఉంటారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయినప్పుడు ఆ మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు ఎండీ చేసిన డాక్టర్లు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు గంట నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
యాక్సిడెంట్, సూసైడ్ వంటి ఘటనల్లో పోస్టుమార్టం పరీక్ష తప్పనిసరిగా చేయిస్తారు పోలీసులు.పోస్టుమార్టం పరీక్ష చేయాల్సి వచ్చిన టైంలో ఆ డెడ్ బాడీని ఓ కానిస్టేబుల్కు అప్పగిస్తారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక పోస్టుమార్టం అనంతరం ఆ డెడ్ బాడీని సదురు కుటుంబసభ్యులకు అప్పగించే వరకు దాని బాధ్యతంతా ఆ కానిస్టేబుల్దే. ఒక వేళ రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయకుండా ఉదయం వరకు ఆ కానిస్టేబుల్ డెడ్ బాడీని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. పోస్టుమార్టం చేసే విధానాన్ని మాత్రం డాక్టర్లు బయటకు చెప్పరు. కానీ బాడీలోని ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. వాటి నుంచి చిన్న భాగాన్ని కట్ చేసి ల్యాబ్కు పంపిస్తారు.
ప్రతి ఎముకలను సైతం పరీక్షిస్తారు. వ్యక్తి నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? లేక ఎవరైనా పాయిజన్ ఇచ్చి చంపారా? అనే విషయాలను ఈ పరీక్షల ద్వారా చెప్పవచ్చు. ఒంటిపై గాయాలకు సంబంధించిన విషయాలను సైతం పోస్టుమార్టం రిపోర్టులు క్షుణ్నంగా వివరిస్తారు. కొన్ని సార్లు ఓ శవానికి రెండు, మూడు సార్లు సైతం పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బటయకు తీసి ఆ దుర్వాసనను భరిస్తూ పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం వద్దని చెప్పే అధికారం పోలీసు ఉన్నతాధికారులకు మాత్రమే ఉంటుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.