Vangaveeti Radha Krishna : పొలిటికల్ ఆటలో కేవలం పావుగా మిగిలిపోయిన వంగవీటి వారసుడు.. తెలుగు న్యూస్ స్పెషల్ విశ్లేషణ

Advertisement
Advertisement

Vangaveeti Radha Krishna : వంగవీటి కుటుంబం గురించి జరుగుతున్న చర్చ ఈనాటిది కాదు. దశాబ్దాల నుంచి నడుస్తోంది. వంగవీటి కుటుంబంలో పెద్ద అయిన వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయి నేటికి 34 ఏళ్లు అవుతోంది. నిజానికి.. వంగవీటి మోహన్ రంగా వల్లనే వంగవీటి కుటుంబం ఫేమస్ అయింది. అక్కడ రాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. అప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ ఉన్నందున్న.. అసలు ఆయన హత్యకు గల కారణాలు, హత్య ఎవరు చేశారు అనేదానిపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. అయితే.. టీడీపీనే వంగవీటి రంగాను హత్య చేసింది అనే విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వంగవీటి రంగా హత్య గురించి ఎలాంటి నిజాలు నిగ్గుతేల్చలేకపోయింది.

Advertisement

సొంత పార్టీ నాయకుడు చనిపోతే కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది అనే అపవాదూ ఇప్పటికీ ఉంది. అయితే.. వంగవీటి రంగా వారసుల్లో వంగవీటి రాధాకృష్ణ ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. అయితే.. వంగవీటి రాధాతో ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం రాధాకృష్ణ టీడీపీ పార్టీలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరినీ ఉపయోగించుకొని ఆయనపై పలు ప్రయోగాలు చేస్తోంది. నిజానికి.. వంగవీటి రంగాతో కొడాలి, వల్లభనేనికి ఫ్రెండ్ షిప్ ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. వంగవీటి రాధాకు వైసీపీ అంటేనే పడదు. కానీ.. కొడాలి, వంశీ ఇద్దరూ కలిసి వైసీపీని తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

why same problem coming for vangaveeti radha krishna

Vangaveeti Radha Krishna : రంగా వారసుడితో రాజకీయ పార్టీల పొలిటికల్ గేమ్

రాధాకృష్ణ మాత్రం టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో రాధా ఇప్పుడు మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. 2004 లో రాధా.. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికలప్పుడు పీఆర్పీ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ.. ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓడిపోయారో అప్పటి నుంచి వైసీపీ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. చివరకు టీడీపీలో అయినా ఆయనకు సరైన గౌరవం దక్కిందా అంటే అదీ లేదు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అందుకే ఏపీలోని పార్టీలన్నీ రాధాకృష్ణను అవసరం మేరకు వాడుకుంటున్నాయి. అవసరం తీరిపోయాక వదిలేస్తున్నాయి.

Advertisement

Recent Posts

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

6 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

7 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

8 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

9 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

10 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

11 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

12 hours ago

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం…

13 hours ago