why YS Jagan ap govt filed petition in supreme court over amaravathi issue
YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఒకే ఒక విషయం గురించి చర్చ. అదే మూడు రాజధానుల అంశం. మూడు రాజధానుల అంశం చీలికి చీలికి గాలి వానలా తయారైంది. టీడీపీ ప్రభుత్వం ఒకే రాజధానిని తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఆవశ్యకత ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ.. మూడు రాజధానులపై చాలా పెద్ద రచ్చ జరిగింది. మూడు రాజధానులపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రానికి ఎక్కడిది అంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. అలాగే మూడు రాజధానుల చట్టాలను అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకోవాలని తీర్పు చెప్పింది.
దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం మరో చర్చకు దారి తీసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఆరు నెలల ముందే దాఖలు చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు దాఖలు చేసింది అనేదే పెద్ద ప్రశ్న. ఈ పిటిషన్ పై ఇంకా సుప్రీంలో విచారణ ప్రారంభం కాలేదు.
why YS Jagan ap govt filed petition in supreme court over amaravathi issue
ఓవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? సుప్రీం తీర్పు ఏం ఇస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు సుప్రీం తీర్పు ఇస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేదే కీలకంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లోపు మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహం మరోలా ఉంది. ఇప్పటికిప్పుడు సుప్రీం కూడా మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వదని టీడీపీ భావిస్తోంది. అలాగే.. వైసీపీ ఆలస్యంగా సుప్రీంలో పిటిషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశం.. ఎన్నికల వరకు ఈ అంశాన్ని సాగదీయడం కోసమే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. చూద్దాం మరి.. అసలు ఎవరి వ్యూహాలు వర్కవుట్ అవుతాయి.. ఎవరివి వర్కవుట్ కావు అనేది.
MECL Non Executive Recruitment 2025 : మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ MECL నాన్-ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2025ను…
Coffee : నేటికీ టీ అన్నా కాఫీ అన్నా ఇష్టపడని వారంటూ లేరు. అందులో టీ కంటే కూడా కాఫీ…
Zodiac Sings : మన హిందూ ధర్మ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో కీలకమైన గ్రహము శుక్ర గ్రహం…
Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు…
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది…
HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్ఐవీ (HIV) వైరస్ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్…
New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…
Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…
This website uses cookies.