AP High Court : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైకోర్టును, కర్నూలుకి తరలించాలనీ, అలా కర్నూలుని న్యాయ రాజధానిని చేయాలనీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, న్యాయ రాజధాని తరలింపు విషయమై అనేక చిక్కుముడులున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఉమ్మడి హైకోర్టు ఏర్పడింది. ఆ తర్వాత, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మారింది. ఈ క్రమంలో పెద్ద ప్రక్రియే నడిచింది. సుప్రీంకోర్టు అనుమతి, రాష్ట్రపతి ఉత్తర్వులు.. ఇదంతా పెద్ద వ్యవహారమే. మళ్ళీ అమరావతి నుంచి హైకోర్టు, కర్నూలుకు మార్చాలన్నా ఆ ప్రక్రియ మళ్ళీ అవసరమవుతుందన్నది న్యాయ నిపుణుల వాదన.
అయితే, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో టెర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కగా వున్నాయి. చంద్రబాబు హయాంలో ఈ ఒప్పందాలు పక్కాగా జరిగాయి. అవిప్పుడు, రాజధాని అమరావతి నుంచి కార్య నిర్వాహక రాజధాని అయినా, న్యాయ రాజధాని అయినా తరలించడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. ఇదిలా వుంటే, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించే విషయమై కేంద్రాన్ని, రాష్ట్ర ఎంపీలు ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది లోక్సభలో కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందిందనీ, అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తేల్చుకోవాలనీ కేంద్రం స్పష్టం చేసింది. అంటే, బంతి ఇప్పుడు హైకోర్టులో పడ్డట్టయ్యిందన్నమాట.
హైకోర్టులో రాజధానికి సంబంధించి పలు పిటిషన్లు విచారణ దశలో వున్నాయి. అందులో న్యాయ రాజధాని అంశం కూడా వుంది. అది ఇప్పట్లో తేలేలా లేదు. ఆ విషయం కేంద్రానికీ తెలుసు. హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ రాజధాని విషయమై సానుకూల స్పష్టత తెచ్చుకుంటే, దాన్ని పరిశీలిస్తామని కేంద్రం తేల్చి చెప్పేసింది. సో, కేంద్రం చేతులు దులిపేసుకున్నట్టే. ఇక, ఇప్పుడు న్యాయ రాజధానికి సంబంధించి వైసీపీ సర్కారు ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.!
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.