YCP leader Byreddy Siddharth Reddy talks about ap govt
Byreddy Siddharth Reddy : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ ప్రభుత్వం గురించి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా లబ్ధిదారులకే అందుతున్నాయని చెప్పుకొచ్చారు. అవే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాయని బైరెడ్డి స్పష్టం చేశారు. నేరుగా ప్రజలకు నగదు బదిలీ అవుతుందని ఆయన అన్నారు. ఎక్కడ కూడా అవినీతి, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని బైరెడ్డి తిప్పికొట్టారు.
సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నా.. కావాలని టీడీపీ, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటి గురించి ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. కేవలం కాలక్షేప రాజకీయాలు చేయడానికి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి ఉందంటూ, వ్యతిరేకత ఉందంటూ నాయకులు చెప్పుతూ టైమ్ పాస్ చేస్తున్నారన్నారు. ప్రజలు ఎవరు కూడా ఏ పార్టీకి ఓటేస్తామో చెప్పుకోరని, దేనికైనా టైమ్ రావాలన్నారు.
YCP leader Byreddy Siddharth Reddy talks about ap govt
మరోవైపు వైసీపీ పని అయిపోయిందని అంటున్నారు. సీఎం జగన్ ను గద్దె దించుతాం అని టీవీల్లో అంటున్నారు. నేను చాలెంజ్ విసురుతున్నా.. 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అంటున్న నాయకులు నా చాలెంజ్ ను స్వీకరిస్తారా? అంటూ బైరెడ్డి ప్రశ్నించారు. ఇంకో 18 నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ సారి కూడా బంపర్ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని బైరెడ్డి చెప్పుకొచ్చారు. 2024 లో వైసీపీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నేను మాత్రమే కాదు.. నాలా జగన్ కోసం పని చేసే చాలామంది నాయకులు కూడా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బైరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ గెలిస్తే.. మా పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న ప్రత్యర్థ పార్టీల నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని బైరెడ్డి ప్రశ్నించారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.