Vijaya Sai Reddy : ఇదే, ఇలాంటి ఫైర్ కావాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కేంద్రం తీరుపైన. పోలవరం ప్రాజెక్టు విషయంలో కావొచ్చు, రాజధాని విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా సహకరించడం లేదు. అయినాగానీ, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు సక్రమంగా వుండాలన్న కోణంలో వైసీపీ సంయమనం పాటిస్తోంటే, దాన్ని అలుసుగా తీసుకుంటోంది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. కేంద్రం వేరు, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వేరు..
అంటూ కమలనాథులు ఎప్పటికప్పుడు వింత వాదనను తెరపైకి తెస్తూ, రాజకీయ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయానికొస్తే, కేంద్రానిది ఓ వైఖరి, బీజేపీది ఇంకో వైఖరి. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లోనూ అంతే. ప్రత్యేక హోదా ఇవ్వరు, రైల్వే జోన్ సంగతి తేల్చరు. రాష్ట్రానికి లోటు బడ్జెట్టుని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రం మీద వున్నా, అదీ సరిగ్గా చేయడంలేదు కేంద్రం.
ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఇంకా ఉపేక్షించడం తగదన్న కోణంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, లెక్కలతో సహా కేంద్రం తీరుని ఎండగట్టేశారు. కేంద్రం, రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నా, అందులో నిజం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. సెస్, ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోన్న కేంద్రం, తదనుగుణంగా రాష్ట్రాలకు వాటాలు ఇవ్వడంలేదని విజయసాయిరెడ్డి నిలదీశారు.
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
This website uses cookies.