అవునా.. చంద్రబాబు ఓడిపోయే ముందు అంతపని చేశారా? విజయసాయి ట్వీట్? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

అవునా.. చంద్రబాబు ఓడిపోయే ముందు అంతపని చేశారా? విజయసాయి ట్వీట్?

అసలే కొత్త రాష్ట్రం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. రాజధాని కూడా లేదు. ఉన్నవన్నీ రెండో శ్రేణి నగరాలే. ఒక్క మెట్రో సిటీ కూడా లేదు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఒక్కటన్నా ఏపీలో ఉందా లేదు.. మరి.. ఏపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. తెలంగాణ కంటే హైదరాబాద్ ఉంది కాబట్టి.. ఎలాగోలా అక్కడి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. మరి.. ఏపీ సంగతి? కొత్త రాష్ట్రాన్ని గట్టెక్కించడం పక్కన పెడితే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. అంటూ చంద్రబాబుపై […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 December 2020,7:44 am

అసలే కొత్త రాష్ట్రం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. రాజధాని కూడా లేదు. ఉన్నవన్నీ రెండో శ్రేణి నగరాలే. ఒక్క మెట్రో సిటీ కూడా లేదు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఒక్కటన్నా ఏపీలో ఉందా లేదు.. మరి.. ఏపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. తెలంగాణ కంటే హైదరాబాద్ ఉంది కాబట్టి.. ఎలాగోలా అక్కడి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. మరి.. ఏపీ సంగతి?

ycp mp vijayasai reddy tweet on chandrababu

ycp mp vijayasai reddy tweet on chandrababu

కొత్త రాష్ట్రాన్ని గట్టెక్కించడం పక్కన పెడితే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. అంటూ చంద్రబాబుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఏపీని అప్పుల రాష్ట్రంగా చంద్రబాబు మార్చారంటూ వైసీపీ నేతల ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ వదిలారు.

సాధారణంగా విజయసాయిరెడ్డి.. ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబుపై ఏదైనా విమర్శ చేయాలంటే ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలోనే అటువంటి విమర్శలు వదులుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఓ సంచలన ట్వీట్ చేశారు.

ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ వచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంవత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా? కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబూ.. అంటూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్ లో ట్వీట్ చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది