ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని అమరావతి నుండి మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాలని నిర్ణయించాడు. అందుకు సంబంధించి వెంటనే అసెంబ్లీ బిల్లు తీసుకు వచ్చాడు.. గవర్నర్ తో ముద్ర వేయించాడు. కాని కోర్టులు మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు పడుతూ వస్తున్నాయి. ఏపీలో రాజధాని విషయం ఇప్పట్లో తేలేలా లేదు. కోర్టుల్లో ఉన్న ఈ విషయం ఎప్పటికి తేలేలా లేదు. వచ్చే ఎన్నికల వరకు రాజధాని మారినట్లుగా ప్రజల ఆలోచన రావాలి. అందుకోసం జగన్ కోర్టు కళ్లు కప్పే ప్రయత్నాలు చేస్తున్నాడట.
రాజధాని మార్పు అనేది కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందే. కోర్టు తీర్పు రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది అనేది క్లారిటీ లేదు. కనుక అనధికారికంగా రాజధానిని తరలించి కోర్టుకు ఇంకా తరలించలేదు అని చెప్పాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడట. వైకాపా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెల్లగా రాజధానిని తరలించేందుకు గాను మొదట సీఎం క్యాంపు కార్యాలయంను వైజాక్ కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టు తీర్పు అనుసారంగా ఇతర రాజధాని తరలింపు కార్యక్రమాలు జరుగుతాయి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా అనధికారికంగా తాత్కాలికంగా వైజాగ్ లో ఆఫీస్ లను ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా పరిపాలన వైజాగ్ నుండి మొదలు అయ్యిందని ప్రజలు విశ్వసిస్తారు. దానికి తోడు ఇది కోర్టు దిక్కారం కూడా అవ్వదు. అందుకే వైజాగ్ ను రాజధానిగా మార్చుకునే పక్రియను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కోర్టు ఎలాంటి విమర్శలు ప్రభుత్వంను కాని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాని చేయలేదు. అనధికారికంగా చేసింది కనుక కోర్టు స్పందించదు అనేది విశ్లేషకుల వాదన. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.