ys jagan change master plan on capital issue
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని అమరావతి నుండి మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాలని నిర్ణయించాడు. అందుకు సంబంధించి వెంటనే అసెంబ్లీ బిల్లు తీసుకు వచ్చాడు.. గవర్నర్ తో ముద్ర వేయించాడు. కాని కోర్టులు మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు పడుతూ వస్తున్నాయి. ఏపీలో రాజధాని విషయం ఇప్పట్లో తేలేలా లేదు. కోర్టుల్లో ఉన్న ఈ విషయం ఎప్పటికి తేలేలా లేదు. వచ్చే ఎన్నికల వరకు రాజధాని మారినట్లుగా ప్రజల ఆలోచన రావాలి. అందుకోసం జగన్ కోర్టు కళ్లు కప్పే ప్రయత్నాలు చేస్తున్నాడట.
రాజధాని మార్పు అనేది కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందే. కోర్టు తీర్పు రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది అనేది క్లారిటీ లేదు. కనుక అనధికారికంగా రాజధానిని తరలించి కోర్టుకు ఇంకా తరలించలేదు అని చెప్పాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడట. వైకాపా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెల్లగా రాజధానిని తరలించేందుకు గాను మొదట సీఎం క్యాంపు కార్యాలయంను వైజాక్ కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టు తీర్పు అనుసారంగా ఇతర రాజధాని తరలింపు కార్యక్రమాలు జరుగుతాయి.
ys jagan change master plan on capital issue
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా అనధికారికంగా తాత్కాలికంగా వైజాగ్ లో ఆఫీస్ లను ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా పరిపాలన వైజాగ్ నుండి మొదలు అయ్యిందని ప్రజలు విశ్వసిస్తారు. దానికి తోడు ఇది కోర్టు దిక్కారం కూడా అవ్వదు. అందుకే వైజాగ్ ను రాజధానిగా మార్చుకునే పక్రియను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కోర్టు ఎలాంటి విమర్శలు ప్రభుత్వంను కాని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాని చేయలేదు. అనధికారికంగా చేసింది కనుక కోర్టు స్పందించదు అనేది విశ్లేషకుల వాదన. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
Farmers : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.…
Funnel Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ మారిన పడుతూనే ఉన్నారు. వారి సంఖ్య రోజుకి…
Guava Leaf Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలని కొన్ని రకాల టీ…
Numerology : ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పడ్డప్పుడు వారు విజయాన్ని సాధిస్తారో లేదో తెలియదు కానీ వారు మాత్రం…
This website uses cookies.