YS Jagan : దటీజ్ వైఎస్ జగన్.. ఆ నలుగురే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.!

YS Jagan : చెప్పాడంటే, చేస్తాడంతే.! బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్.. అంటూ పదే పదే చెబుతుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఔను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్‌బోన్ అని భావించబట్టే, బీసీలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, చంద్రబాబు హయాంలో స్నేహధర్మం కోటాలో రాజ్యసభ సీటు సంపాదించిన బీజేపీ నేత సురేష్ ప్రభు పదవీ కాలం ముగియడంతో, రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

ఈ నాలుగు స్థానాలకుగాను, విజయసాయిరెడ్డిని కొనసాగిస్తూ, మరో ముగ్గురు కొత్తవారికి రాజ్యసభ అవకాశం కల్పించారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాస్సేపటి క్రితం వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ.. తమ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేసే నలుగురు అభ్యర్థుల వివరాల్ని ప్రకటించారు. వారిలో బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, వైసీపీకి చెందిన మరో కీలక నేత బీద మస్తాన్‌రావులకు అవకాశం దక్కింది.ఆర్.కృష్ణయ్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమ నేతగా సుపరిచితుడాయన. గతంలో టీడీపీ నుంచి తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆర్.కృష్ణయ్య, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.

YS Jagan Finalized RajyaSabha Members List

వాస్తవానికి, తెలంగాణలో గెలవడానికి టీడీపీకి మరో అవకాశం లేక, ఆర్.కృష్ణయ్యను అరువు తెచ్చుకుంది అప్పట్లో. ప్రత్యక్ష రాజకీయాలకు ఆ తర్వాత దూరమైన ఆర్.కృష్ణయ్య, బీసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే వున్నారు. ఈ క్రమంలోనే ఆర్.కృష్ణయ్యకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తగిన గౌరవం లభించిందని చెప్పక తప్పదు. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి సినీ నిర్మాత కూడా. బీసీ కోటాలోనే బీద మస్తాన్ రావుకి కూడా రాజ్యసభ అవకాశం కల్పించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్ని బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టబెట్టడం గమనించాల్సిన విషయం. తమది బీసీలకు వెననుదన్నుగా నిలిచే పార్టీ అని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Recent Posts

Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…

1 hour ago

Rashmi Gautam Sudheer : సుధీర్‌తో గొడ‌వ‌ల విష‌యంలో కార‌ణం చెప్పిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో సుధీర్-ర‌ష్మీ గౌత‌మ్ జంట ఒక‌టి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…

2 hours ago

Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…

3 hours ago

Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…

5 hours ago

Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు – వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…

6 hours ago

Feeding Cows : ఆవులకు ఆహారం తినిపించ‌డం వల్ల కలిగే జ్యోతిషశాస్త్ర ప్రయోజనాలు ?

Feeding Cows  : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…

7 hours ago

Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా త‌క్కువే అని చెప్పాలి. జియో…

8 hours ago

Morning or Night Shower : ఉదయం స్నానం చేయాలా లేదా రాత్రి స్నానం చేయాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?

Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…

9 hours ago