ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రతిపక్షాల విషయంలో చాలా జాగురతతో వ్యవహరిస్తాయి. తమ లోపాలు ఏవి కూడా ప్రతిపక్షాలకు చిక్కకుండా ముందుకు వెళ్తాయి. ఎంత మంచి పాలన అందించిన కానీ ఒకే ఒక్క తప్పుతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడి ఎలాంటి అవకాశం ఇవ్వటానికి ఇష్టపడవు. అయితే ప్రతిపక్షంలో ఉండి, అధికారపక్షంపై ఆరోపణలు చేయకుండా మౌనంగా ఉంటె తమ ఉనికిని కోల్పోతామని భావించే ఆయా పార్టీలు ఎదో ఒక వంక పెట్టుకొని అధికార పక్షం మీద దుమ్మెత్తిపోస్తుంటాయి.
అయితే ఆంధ్రాలో పరిస్థితి అందుకు బిన్నంగా కనిపిస్తుంది. సీఎం YS Jagan తీసుకునే అనేక నిర్ణయాలను ప్రతిపక్షము టీడీపీ ముందు విమర్శించినా కానీ తర్వాత వాటికీ అనుకోకుండా మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే,, మొదట దానిని టీడీపీ తీవ్రంగా విమర్శించింది. కానీ కొన్ని రోజులకు అదే తెలుగుదేశం పార్టీ నేతలు వాలంటీర్లు లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీని బట్టి చూస్తే ఏపీ ప్రతిపక్షము ఎలా ఉందొ అర్ధం అవుతుంది.
అయితే ఇక్కడే జగన్ తన జాలి హృదయం చూపించాలని అనుకున్నాడో ఏమో కానీ, ప్రతిసారి ప్రతిపక్షాలు తమ మీద ఎటాక్ చేయటానికి ఎదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటున్నాడు. తాజాగా ఇంటర్ మరియు 10 వ తరగతి పరీక్షల విషయంలో ప్రతిపక్షాల చేతికి పెద్ద ఆయుధమే ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా పరీక్షలు నిర్వహించటం మంచిది కాదని ఎవరెన్ని చెప్పిన కానీ సీఎం జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నాడు.
ఇప్పుడు దీనినే ప్రతిపక్షము గట్టిగా పట్టుకొని నిలదీస్తుంది. పిల్లల భవిష్యత్ విషయంలో రాజకీయ పట్టింపులు వద్దని, వెంటనే పరీక్షలు రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి. సాధారణ ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం కలుగుతుంది. తాము ఓటు వేసి గెలిపించిన తమ నేత ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవేమి జగన్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ప్రతిపక్షాలకు మంచి అవకాశం ఇస్తున్నాడు..
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.