YS Jagan : ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెనుక వైఎస్ జ‌గ‌న్‌ మాస్ట‌ర్ ప్లాన్‌..!

Advertisement
Advertisement

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నవేళ ఎమ్మెల్యేల అనార్హత వేటు అంశం వెలుగులోకి వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేల పై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించడం జరిగింది. ఇక రాత పూర్వక స్పందన కోసం ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగింది. ఇక వారి స్పందన దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకొనున్నారు. అయితే ఇన్ని రోజులు ఊరుకున్న పార్టీలు ఉన్న ఫలంగా చర్యలకు డిమాండ్ చేయడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు స్థానాలు నిజానికి వైసిపి పార్టీ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం రాజ్యసభ స్థానాలకు పోటీపడే అవకాశం కనిపిస్తుంది. ఇక అదే జరిగినట్లయితే ఎమ్మెల్యేల మద్దతుకి అడ్డుకట్ట వెయాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలపై అనార్హత వేటు అంశం వెలుగులోకి రావడం జరిగింది. అయితే టిడిపిలోకి వెళ్లిన నలుగురు వైసిపి ఎమ్మెల్యేలపై మరియు వైసీపీలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలపై రెండు పార్టీలు పరస్పరం స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి . దీంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గత ఎన్నికల్లో వైసిపి పార్టీ 151 స్థానాలు టిడిపి 23 జనసేన ఒక స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే టిడిపి పార్టీ నుండి వల్లభనేని వంశీ మోహన్ ,వాసుపల్లి గణేష్ కుమార్ , మద్దాలి గిరి వైసిపి పార్టీలో చేరారు. ఇక గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవెల్లి శ్రీదేవి లపై వైసీపీ హై కమాండ్ వేటు వేయడం జరిగింది. ఇక ఈ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసిపి మరియు టిడిపి వేరువేరుగా స్పీకర్లకు ఫిర్యాదులు చేశాయి. దీంతో స్పీకర్ వారికి నోటీసులు పంపించారు.

Advertisement

అయితే నిజానికి వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగానే దీనిని అమలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమీపంలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం చూస్తుంది. ఒక్కో రాజ్యసభ సీట్ తగ్గించుకోవాలంటే దాదాపు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఈ లెక్కన వైసీపీకి అవసరమైన సంఖ్యాబలం ఉంది . కానీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఇలాగే అంచనాలు వేసుకుని దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అభ్యర్థుల మార్పుతో చాలామంది ఎమ్మెల్యేలు టిడిపి పక్షాన చేరుతున్నారు. ఇక అలాంటి వారికి అనర్హత వేటువేసి నియంత్రణ లోకి తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఈ విధంగా చేయడం వలన టిడిపిలో చేరికలకు అడ్డుకట్ట వేయవచ్చని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధ్విముక వ్యూహంతో జగన్ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

Advertisement
Advertisement

Recent Posts

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

39 minutes ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

8 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

9 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

10 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

10 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

11 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

12 hours ago