YS Jaganmohan reddy one more idea for to stop ap local body elections
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగక తప్పేలా లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగా ఎన్నికలు వద్దు అనుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అన్నట్లుగా భావిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు జరిగితే వచ్చే సమస్య ఏంటీ అన్నట్లుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ దురుద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏకంగా సుప్రీం కోర్టు వైఎస్ జగన్ ను ప్రశ్నించడంతో ప్రస్తుతం వైకాపా నాయకులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. వైకాపా నాయకులు మొదటి నుండి కూడా నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ల కూడదు అనే నిర్ణయంతో ఉన్నారు. కాని కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు సహకరించాల్సిందే అంటూ క్లారిటీ వచ్చేసింది.
YS Jaganmohan reddy one more idea for to stop ap local body elections
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను ఆపేందుకు చివరి ప్రయత్నంగా కేంద్రం వద్దకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాలతో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయించేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. అందుకోసం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఢిల్లీ వెళ్లగా అక్కడ ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఒక వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్నికలకు సిద్దం అవుతుండగా వైకాపా నాయకులు మాత్రం వెళ్లాల వద్దా అనే మిమాంశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రం వద్దకు సీఎం వైఎస్ జగన్ వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక వేళ జగన్ తో సంబంధాల కోసం కేంద్రం సరే అని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తే మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒప్పుకుంటాడా అనేది ప్రశ్న. చాలా మంది కూడా నిమ్మగడ్డ మొండి వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఖచ్చితంగా కేంద్రం చెప్పినా కూడా నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా వెనక్కు తగ్గడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ చేయబోతున్న ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో తెలియాలంటే ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.