ysrcp party ఏపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయాన్ని సొంతం చేసుకున్న వైకాపా ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న అభివృద్ది మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే సీఎం అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన మాత్రమే కాకుండా ఆయన మంత్రి వర్గ సహచరలు మరియు ఇతర పార్టీ నాయకులు కూడా బాగా పని చేస్తేనే లాభం ఉంటుంది. అలా కాదని ఎలాగూ పార్టీ జోరు మీద ఉంది.. మేము ఏం చేయకున్నా కూడా తదుపరి ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం అనే ఫలింగ్ ఉంటే మాత్రం 2024 ఎన్నికల్లో కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగూతు ఉంటే ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు మరియు మున్సిపల్ ప్రజా ప్రతినిదులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్లే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారు కనుక ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. కింది స్థాయిలో విమర్శలు వ్యతిరేకత మొదలయితే మాత్రం ఇక అంతే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగలేదు కనుక అందుకే వారి కష్టాలు మీకు అర్థం అవ్వడం లేదు. ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్లడం లేదు అంటూ కింది స్థాయి ప్రజా ప్రతినిధులను మంత్రి ప్రశ్నించాడు. సీఎం దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లింది. అందుకే ప్రజల్లోకి వెళ్లకుండా తమకు పట్టనట్లుగా ఉంటున్న ప్రజా ప్రతినిధులను మాత్రం సస్పెండ్ చేసే వరకు వెళ్లవలిసి వస్తుందంటూ హెచ్చరించాడు. ఇప్పటికి అయినా కింది స్థాయి నాయకులు కార్యకర్తలకు మరియు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధనాయకత్వం ఆదేశించింది. మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.