Home » Andhra Pradesh » Ysrcp Vs Ysrcp In Guntur
andhra pradesh

YSRCP : వైసీపీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన వైసీపీ సీనియర్ నేత.. ఈ విషయం జగన్ కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా?

Authored By
Emmaneni
The Telugu News | Published on: August 19, 2021, 8:15 am
Advertisement

YSRCP గుంటూరు : టీడీపీ తరపున గెలిచి వైసీపీ YSRCP లో చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌కు ఆ పార్టీ నేత చంద్రగిరి ఏసురత్నం షాక్ ఇచ్చారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిధర్ తప్పుడు అఫిడవిట్ వేశారని అనేక విషయాలు గోప్యంగా ఉంచారని..చెప్పిన విషయాలు కూడా అబద్దాలని ఏసురత్నం హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Ysrcp

నిజానికి మద్దాలి గిరి వైసీపీలో చేరక ముందే ఏసురత్నం పిటిషన్ వేయగా, అది ఇప్పుడు విచారణకు రానుంది. ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ.. తన పిటిషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఏసురత్నం అంటున్నారు. అంతేగాక ఏసురత్నం.. తన దగ్గరున్న సాక్ష్యాలతో మద్దాలి గిరిధర్ పై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. గతంలో తప్పుడు అఫిడవిట్లు, కేసులను దాచి పెట్టడం వంటి కారణాలతో పలు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడింది.

Advertisement

మడక శిర ఈరన్న.. YSRCP

గత టీడీపీ హయాంలో అనంతపురం జిల్లా మడకశిర నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న నామినేషన్ పత్రాల్లో కొన్ని వివరాలు తప్పుగా ఇచ్చారని నిర్దారించిన హైకోర్టు ఆ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా.. సమర్థించింది. దాంతో ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఖరారు చేశారు. అయితే సహజంగా ఇలాంటి పిటిషన్ల విచారణ ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ.. ఇలాంటి పిటిషన్లపై పదవి కాలం ముగిసిన తర్వాత కూడా తీర్పులొచ్చాయి.

ys jagan

Advertisement

కానీ ఈరన్నకు మాత్రం .. కొంత కాలం పదవి కోల్పోక తప్పలేదు. ఈ విషయంలో మద్దాలి గిరిధర్ కు ఎలాంటి ఫలితం వస్తుందోనన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏం జరిగినా వైసీపీలో రచ్చ జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన తనకు ప్రాధాన్యత కల్పించడం లేదని మద్దాలి గిరిధర్ అలక పూనినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Emmaneni

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి