Zomato | జొమాటో వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ప్లాట్ఫామ్ ఫీజు పెంపు, దసరా-దీపావళి సీజన్లో భారం మరింత
Zomato | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్ సమయంలో స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా జొమాటో తమ ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

#image_title
రూ. 10 నుంచి రూ. 12కి ఫీజు పెంపు
పండుగల సీజన్ను టార్గెట్ చేస్తూ, జొమాటో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నగరాల్లో ప్రతి ఆర్డర్పై ప్లాట్ఫామ్ ఫీజును రూ.10 నుంచి రూ.12కి పెంచింది. 2023 ఆగస్టులో ప్రారంభించిన ఈ ఫీజు వ్యవస్థను అప్పట్లో రూ.2గా ప్రవేశపెట్టగా, ఇప్పుడు వరుసగా పెరిగి రూ.12కు చేరింది. కంపెనీ ప్రకారం, ఈ పెంపు అన్ని నగరాల్లోని కస్టమర్లకు వర్తిస్తుంది.
పండుగల సమయంలో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం, డెలివరీ బృందానికి అధిక చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని సమాచారం. మరోవైపు, జొమాటో మాతృసంస్థ ఎటర్నల్కు 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర లాభం 90% తగ్గడం కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపినట్లు అంచనాలు.గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.253 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ, ఈ ఏడాది అదే కాలంలో కేవలం రూ.25 కోట్ల లాభంతోనే సరిపెట్టుకుంది. ఆదాయం 70% పెరిగినా, నికర లాభం భారీగా తగ్గింది.
.