7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
ప్రధానాంశాలు:
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. 2025 జూలై 1 నుంచి DAలో 4 శాతం పెంపు అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 55 శాతం DA 59 శాతానికి చేరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ఊరటను తీసుకొస్తుందని భావిస్తున్నారు. DA పెంపు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) ఆధారంగా లెక్కించబడుతుంది. మే 2025లో ఈ సూచీ 144కి చేరగా, జూన్ 2025లో ఇది 144.5కి చేరితే సగటు సూచీ 144.17గా ఉంటుంది. దీని ప్రకారం DA 58.85 శాతంగా లెక్కవచ్చే అవకాశం ఉంది, దీన్ని రౌండ్ చేసి 59 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది.

7th Pay Commission
7th pay commission : 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే వార్త
ఈ పెంపును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీపావళి సీజన్ నేపథ్యంలోనే ఇది వెలువడనుందని సమాచారం. ఇదే 7వ వేతన కమిషన్ (7th Pay Commission) కింద చివరిది కానుంది, ఎందుకంటే దీని గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. అయితే ఇప్పటికే 8వ వేతన కమిషన్ ప్రకటించినప్పటికీ, దాని సిఫార్సులు అమలవ్వటానికి కనీసం 18 నుండి 24 నెలలు పడే అవకాశం ఉంది. దీంతో 2027 వరకు ఉద్యోగులు 7వ వేతన కమిషన్ కిందే వేతనాలు పొందనున్నారు.
DA పెంపు ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, దేశీయ వినియోగ రంగాల్లో డిమాండ్ను పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో వినియోగం బాగా పెరిగే ఛాన్స్ ఉంది. వాహనాలు, గృహ సామాగ్రి, స్థిరాస్తులు వంటి భారీ కొనుగోళ్లపై దృష్టి పెట్టే అవకాశముంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం మెరుగుపడి, దిగువ, మధ్య తరగతి ప్రజల ఆదాయాల్లో కూడా వృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని నివేదికలు ఈ పెంపు కేవలం 3 శాతమే ఉండవచ్చని సూచిస్తున్నాయి. జూన్ 2025 AICPI-IW డేటా ఆధారంగా ఈ స్పష్టత రానుంది.