
Bus Tickets : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త... బస్ టికెట్లపై భారీ తగ్గింపు..!
Bus Tickets : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున ఆయా ప్రభుత్వాలు అనేక ఆఫర్స్ డిస్కౌంట్ ని అందిస్తూ వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊర్లకు దూరంగా ఉంటున్న వారి కోసం కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాలలో పలు సంస్థలు బస్సు ఆక్యుపేన్షిని పెంచేందుకు అనేక రకాల డీల్స్ ని డిస్కౌంట్స్ పెడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రైవేట్ సంస్థలు ఆర్టీసీ బస్ టికెట్లపై రాయితిని కూడా అందిస్తుంటాయి. ఇక ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువచ్చేందుకు కొన్ని సంస్థలు ఉత్సాహంగా పనిచేస్తుంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఓటింగ్ శాతం పెంచేందుకు అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పలు ప్రైవేట్ సంస్థలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఓటు వేసిన వారికి ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జరిగిన బెంగళూరు ఎన్నికల్లో రాపిడో సంస్థ కూడా ఫ్రీ రైడ్స్ ని కల్పించింది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు , వికలాంగులు వంటి వారిని ఓటు వేపించడానికి పోలింగ్ బూత్ కి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి పంపేందుకు రాపిడో బైక్ ఉచితంగా చర్యలు చేపట్టింది. ఈ విధంగా ప్రభుత్వాలు ఎలాగైనా ఓట్ల శాతం పెంచేందుకు అందరితో ఓట్లు వేయించాలనే ఆలోచనతో వినూత్న పద్ధతులను ఎంచుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలు ఓటర్ల కోసం కొత్త ఆఫర్లు తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ అభిబస్ ఓటర్ల కోసం కొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Bus Tickets : రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త… బస్ టికెట్లపై భారీ తగ్గింపు..!
ఈ నేపథ్యంలోనే ఓటు వేయడానికి సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు చార్జీలపై ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లుగా ఇటీవల అభిబస్ సీఈవో లెనిన్ కోడూరు , సిఓఓ రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే మే 13 నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్లు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్లేటువంటి ప్రయాణికులకు అభి బస్సులో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ABHIVOTE కూపన్ కోడ్ అందుబాటులో ఉంచింది. ఇక ఈ కూపన్ కోడ్ తో మీరు మీ టికెట్ పై కనీసం 20% గరిష్టంగా రాయితీ పొందవచ్చు. అంటే దాదాపు 250 రూపాయలు వరకు మీకు రాయితీగా లభిస్తుంది. అంతేకాక అదనంగా ₹100 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ఇక ఈ ఆఫర్ ని ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ వినియోగించుకోవచ్చని అభిబస్ యాజమాన్య సంస్థ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం అభిబస్ అందుబాటులో ఉంచిన ఈ ఆఫర్ ను మీరు కూడా ఉపయోగించుకోండి. దీనిని షేర్ చేసి మరింత మందికి తెలిసేలా చేయండి.
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
This website uses cookies.