Acham Naidu : మంత్రి పదవి కోసమే ఆళ్ల ఆరాటం : అచ్చెన్నాయుడు

Advertisement
Advertisement

Acham Naidu : చంద్రబాబు నాయుడపై సీఐడీ పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ కళ్లు తెరవాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నాడు. రైతులెవరూ తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో రామకృష్ణారెడ్డి ఆఫీసులో పనిచేసే జాన్సన్ అనే వైసీపీ కార్యకర్త చేత తప్పుడు కేసులు సృష్టించారు. ఏ ఆధారం లేకుండానే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రుజువులు వుండి వుంటే నేడు కోర్టులో సీఐడీ ప్రవేశపెట్టేది.

Advertisement

Acham Naidu Fair On alla ramakrishna reddy

నిత్యం రాజధానిపై నిందలు వేస్తూ అమరావతి బ్రాండ్ ను వైసీపీ దెబ్బ తీస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు వైసీపీ తీరని ద్రోహం చేస్తోంది. నిరాధారమైన కేసులు వేయడం రాజశేఖర్ రెడ్డి కాలం నుండి వస్తోంది.అసైన్డ్ భూముల అక్రమాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు.అసైన్డు రైతుల నుండి భూములు లాక్కున్న ఘనులు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఇళ్ల పట్టా పేరుతో 6 వేల ఎకరాల అసైన్డు భూములు గుంజుకుని కోట్లకు అమ్ముకున్నారంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగాడు.

Advertisement

Acham Naidu : ఆళ్ల విలక్షణ నటుడు

జీ.ఓ నంబర్ 41లో ఎలాంటి తప్పులు లేవు కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చింది.వైసీపీ పెట్టిన అక్రమ కేసు కోర్టులో నిలబడదు. అర్ధం లేని ఫిర్యాదులు చేసి ప్రతిష్టను దిగజార్చాలనుకున్న వైసీపీ నేతలు మరోసారి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, తమ భూములు ఎవరూ లాక్కోలేదని సీఐడీ ఎదుట అసైన్డు రైతులు చెప్పారు. ఆళ్ల రామకృష్టారెడ్డి తన విలక్షణ నటనకు తెరదింపాలి. మంత్రిపదవి కోసం పడుతున్న ఆరాటం చూస్తే జాలేస్తోంది.

Acham Naidu Fair On alla ramakrishna reddy

ఆళ్ల వేసిన కేసులు దళిత ప్రయోజనాల కోసమో.. వైసీపీ ప్రయోజనాల కోసమో తెలుసుకోలేని అమాయక స్థితిలో దళితులు లేరు. ఆర్కేకు చిత్తశుద్ధి వుంటే దళితులు అధికంగా ఉన్న అమరావతి నుండి రాజధాని మార్చి దళితులను మోసం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిపై కోర్టులో కేసులు వేయాలి. రైతులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు ఇప్పించాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ రైతులు ప్రభుత్వ ఒత్తిడిలకు లొగ్గలేదు.తక్షణమే వైసీపీ రాజధాని రైతులకు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి.

కక్షలు, దౌర్జన్యాలు, అరాచకంతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. అహంకారంతో ప్రభుత్వం పంతానికి పోయి, తప్పులు సరిదిద్దుకొనే ప్రయత్నం చెయ్యకుండా సమస్యలు కొని తెచ్చుకొంటోంది. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వెయ్యాల్సిన ప్రభుత్వం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం వల్లనే కోర్టులతో ప్రభుత్వం తలంటించుకోవాల్సి వచ్చింది అంటూ అచ్చెన్న విమర్శలు చేశాడు.

Advertisement

Recent Posts

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

6 mins ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

1 hour ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

3 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

4 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

5 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

6 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

7 hours ago

This website uses cookies.