Home » News » Bangladesh Is In Turmoil
News

Bangladesh : అల్లకల్లోలంగా బంగ్లాదేశ్.. అస‌లేం జ‌రుగుతుంది ఈ దేశంలో..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 5, 2024, 10:35 pm
Advertisement

Bangladesh : 170 మిలియన్ల జనాభా ఉన్న దక్షిణాసియా దేశం బంగ్లాదేశ్ ప్ర‌స్తుతం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న‌ది. ఈ దేశంలో నిరసనలు కొత్త కాదు. కానీ గత కొన్ని వారాల్లో జరిగిన హింస మాత్రం భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల్లో సుమారు 300 మంది మరణించారు, ఆదివారం ఒక్కరోజే 94 మంది మరణించారు. వారిలో 13 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో బంగ్లాదేశ్ చరిత్రలో ఒక్క‌ రోజులో అత్యంత ఘోరమైన ప్రాణ నష్టం జ‌రిగిన సంఘ‌ట‌న ఇదే. ఆ దేశ‌ మీడియా, నిరసనకారులు పెరుగుతున్న మరణాల సంఖ్యకు ఎక్కువగా పోలీసులే కారణమని చెబుతుండ‌గా అధికారులు మాత్రం ఆత్మరక్షణ, ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి మాత్రమే కాల్పులు జరుపుతున్న‌ట్లుగా పేర్కొంటున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాలను రద్దు చేయాలనే విశ్వవిద్యాలయ విద్యార్థుల డిమాండ్లతో శాంతియుత నిర‌స‌న‌లు ప్రారంభమయ్యాయి. జూలై ప్రారంభం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. కోటాల్లో మూడవ వంతు 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం జ‌రిగిన పోరాటంలో పాల్గొన్న ఆర్మీ అధికారులు, జ‌వాన్ల‌కు కేటాయించబడింది. ఈ వ్యవస్థ వివక్షతో కూడుకున్నదని, దానిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని నిర‌స‌న‌కారులు, ప్రచారకులు వాదిస్తూ వ‌స్తున్నారు. అయితే వారి డిమాండ్లు నెరవేర‌క‌పోగా నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందాయి.

Advertisement

దాంతో 2009 నుండి దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని వేలాది మంది పిలుపునిచ్చారు.
దేశవ్యాప్త కర్ఫ్యూను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రతిస్పందించింది. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం నిలిపివేయడం కొనసాగించింది. హసీనా తన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న వారిని దేశాన్ని అస్థిరపరిచే తీవ్రవాదులుగా అభివర్ణించారు. బంగ్లా ఉద్రిక్త‌ల‌పై ఐక్యరాజ్యసమితి స్పందిస్తూ హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు, భద్రతా దళాలు సంయమనం పాటించాలని కోరింది. నిరసన ఉద్యమంలో శాంతియుతంగా పాల్గొనేవారిని లక్ష్యంగా చేసుకోవడం మానేయాలి, ఏకపక్షంగా నిర్బంధించబడిన వారిని వెంటనే విడుదల చేయాలి, పూర్తి ఇంటర్నెట్ సదుపాయాన్ని పునరుద్ధరించాలి, అర్ధవంతమైన చ‌ర్చ‌ల వాతావ‌ర‌ణ పరిస్థితులను క‌ల్పించాల‌ని సూచించింది.

Bangladesh ప్రభుత్వ స్పంద‌న‌..

నిరసనకారులు రెచ్చగొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ప్ప‌టికీ ప్రభుత్వం తీవ్ర సంయమనం పాటించిందని హసీనా మంత్రులు అంటున్నారు. తమ రాజకీయ వ్యతిరేకత, హింసను ప్రారంభించిన ఇస్లామిస్ట్ పార్టీల ద్వారా నిర‌స‌న‌కారులుగా చొరబడ్డాయని వారు ఆరోపిస్తున్నారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థి నిరసనకారులతో సహేతుకమైన చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

Bangladesh : అల్లకల్లోలంగా బంగ్లాదేశ్.. అస‌లేం జ‌రుగుతుంది ఈ దేశంలో..!

అయితే రిజర్వేషన్ల విషయంలో జరుగుతోన్న నిరసనల కారణంగా శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్‌ హసీనాకు ఆ దేశ సైన్యం హెచ్చరించింది. ఒకవైపు దేశ యువత నుండి తిరుగుబాటు, మరోవైపు 15 ఏళ్లుగా తనతో కలిసి పని చేస్తున్న అధికారుల నుండి సహకారం అందకపోవడం, ఒక్కసారిగా సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధాని హసీనాకి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి