Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!
ప్రధానాంశాలు:
గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప వరం... ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర (KVP) అనే ప్రత్యేక పొదుపు పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ముఖ్యంగా రైతులు, చిన్న పొదుపుదారుల కోసం రూపొందించినదిగా చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా వారు తక్కువ మొత్తంతో కూడిన పెట్టుబడిని పెట్టి, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం పొందే అవకాశాన్ని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ల ద్వారా అందించే ఈ పథకం, పెట్టుబడిని సురక్షితంగా ఉంచడమే కాకుండా, భద్రత కలిగిన ఆదాయ మార్గాన్ని కూడా కల్పిస్తుంది.

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!
Kisan Vikas Patra Scheme : కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో రెట్టింపు లాభాలు
ఈ పథకం ప్రత్యేకత ఏంటి అంటే.. మీరు పెట్టే డబ్బు ఒక నిర్దిష్ట కాలానికీ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతానికి, ఈ డబ్బు రెట్టింపు కావడానికి సుమారుగా 115 నెలలు (9 సంవత్సరాలు 7 నెలలు) పడుతుంది. కనీస పెట్టుబడి రూ. 1000 మాత్రమే కాగా, ఎక్కువ మొత్తంలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మూడు రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి: సింగిల్ హోల్డింగ్ (ఒక్కరి పేరిట), జాయింట్ ఏ (ఇద్దరు కలిపి, ఒకరు చనిపోతే మరొకరికి డబ్బు అందేలా), జాయింట్ బీ (ఇద్దరూ కలసి డబ్బు తీసుకోవచ్చుని).
కిసాన్ వికాస్ పత్ర పథకానికి భారతీయ పౌరులెవరికైనా అర్హత ఉంది. 18 ఏళ్ల పైబడినవారే దీనికి దరఖాస్తు చేయగలరు. మైనర్ పేరుపైన కూడా ఈ పథకంలో సర్టిఫికెట్ తీసుకోవచ్చు, కానీ అతనికి న్యాయబద్ధమైన సంరక్షకుడు ఉండాలి. ఈ విధంగా, కిసాన్ వికాస్ పత్ర పథకం ఒక వైపు పొదుపును పెంపొందిస్తూనే, మరోవైపు భద్రతతో కూడిన పెట్టుబడి అవకాశాన్ని కూడా అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కలిగి ఉండొచ్చు.