Botsa Satyanarayana : ఉన్నట్టుండి బొత్స మౌనానికి కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతుంది?
Botsa Satyanarayana : వైసీపీలో కీలక నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఆయనకి సార్వత్రిక ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం రూపంలో మళ్లీ లక్ తగిలింది.ఆ మీదటా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది. దీంతో ఇక ఆయన నంబర్ టూ గా వైసీపీలో ఉంటారు అని అంతా అనుకున్నారు. టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడతారని అందరు అన్నారు. కాని ఎందుకో బొత్స ఈ మధ్య చాలా సైలెంట్ అయ్యారు.అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ.. ఆపై మండలిలో ప్రతిపక్ష నేత హోదా. ఇక చెలరేగిపోతాడని భావించిన బొత్స ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పిరెడ్డిని తప్పించి బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించడంతో వైసీపీలో ఇక ఆయనే నెంబర్ టూ కాబోతున్నారు అని సంకేతాలు ఇచ్చారు జగన్.
దాంతో వైసీపీకి సంబంధించి బొత్స చక్రం తిప్పుతారని అనుకుంటే అంచనాలను తలకిందులు చేస్తూ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బొత్స మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఆమధ్య బెజవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. ఇంత ఆలస్యంగా ఏ మొహం పెట్టుకొని వచ్చారని నిలదీయడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు రావడం లేదు.. జగన్ తో కలిసి వైసీపీని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటే ఆయన గప్ చుప్ కావడం పట్ల పార్టీలో చర్చ జరుగుతోంది.
Botsa Satyanarayana : ఉన్నట్టుండి బొత్స మౌనానికి కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతుంది?
అయితే ప్రజల నుంచి నిలదీతలు ఎదురవ్వడంతోనే బొత్స సడెన్ సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై రాజకీయం చేస్తే ప్రజల్లో మరింత పలుచన అవుతామని…దూకుడుగా రాజకీయం చేయడం వలన ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అని మౌనం వహిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన చీపురుపల్లిలో ఓటమి పాలవ్వడంతో అక్కడ అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడంతోనే సైలెంట్ అయ్యారని బొత్స సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో ఇటీవల అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వదిలి పోతున్నారు. అదే విధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కూడా సైలెంట్ అయ్యారు. శాసనమండలిలో చూస్తే వైసీపీ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో కూడా తెలియడం లేదు. దీంతోనో ఆచీ తూచీ స్పందించాలని భావించే బొత్స కొంత తగ్గి ఉంటారని అంటున్నారు
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.