Minister Talasani : నంది అవార్డుల ప్రధానోత్సవం పై వివాదంపై మంత్రి తలసాని వైరల్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 6, 2023, 5:00 pm

Minister Talasani : తెలంగాణ సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నంది అవార్డుల వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నంది అవార్డుల ప్రధానోత్సవం పై సినీ నిర్మాత సునీత కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ వివాదంపై తలసాని స్పందించారు. ఎవరు పడితే వాళ్ళు అడిగితే నంది అవార్డులు ఎవరని తేల్చి చెప్పారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఎవరు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదని పేర్కొన్నారు. నంది పురస్కారాలు ఇవ్వాలని ఎవరు అడగలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా మంది పెద్దలు ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు.

BRS Govt Will Plan To Give Nandi Awards Says Talasani

BRS Govt Will Plan To Give Nandi Awards Says Talasani

సింగల్ విండో షూటింగ్ పర్మిషన్ విషయంలో…ఐదో షో… హైదరాబాద్ సిటీలో అన్ని రకాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సహకరించింది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డుల ప్రధానోత్సవం అనేది అక్కడ గాని ఇక్కడ గాని.. ఇవ్వటం అనేది ఆగిపోయింది అనేది వాస్తవం. కానీ తప్పకుండా వచ్చే ఏడాది నుండి నంది అవార్డుల ప్రధాన ఉత్సవం ఇవ్వటం ప్లాన్ చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp