Categories: Newspolitics

Chandrababu Naidu : కూట‌మి ఎమ్మెల్యేల‌కి చంద్ర‌బాబు, ప‌వ‌న్ సూచ‌న‌లు.. మేము చెప్పేది త‌ప్ప‌క ఆచ‌రించాలి..!

Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వారికి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ.. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలి… తెలుసుకోవాలని సూచించారు. ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది.

Chandrababu Naidu : నిరంత‌రం నేర్చుకోవాలి..

పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు… కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు’’ అని తెలిపారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. “తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరిలో నేనే సీనియర్. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు.

Chandrababu Naidu : కూట‌మి ఎమ్మెల్యేల‌కి చంద్ర‌బాబు, ప‌వ‌న్ సూచ‌న‌లు.. మేము చెప్పేది త‌ప్ప‌క ఆచ‌రించాలి..!

సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందన్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని…. వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలన్నారు.

Recent Posts

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

30 minutes ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

2 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

3 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

4 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

5 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

6 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

7 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

8 hours ago