
congress shock to sabitha indra reddy in maheshwaram
Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి తెలుసు కదా. తెలంగాణ విద్యా శాఖ మంత్రి. మహేశ్వరం నియోజకవర్గం తన అడ్డా. అక్కడ సబితా ఇంద్రారెడ్డికి ఉన్న పాపులారిటీ మామూల్ది కాదు. అందుకే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేర్చుకొని మరీ సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవి కూడా వచ్చింది. మళ్లీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ కేటాయించింది. ఈసారి ఎన్నికలు చాలా టఫ్ కాబోతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థులను అయితే నిలుపుతుందో.. వాళ్లకు తగ్గట్టుగా.. గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ దీటైన నాయకులను బరిలోకి దించుతోంది. గజ్వేల్, కామారెడ్డి లాంటి నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ వదలడం లేదు అంటే.. కాంగ్రెస్ ఈసారి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నది ఎవరో కాదు.. బీఆర్ఎస్ నుంచి సబితా రెడ్డి పోటీ చేస్తున్నారు. సబితా రెడ్డికి మహేశ్వరంలో ఉన్న బలం అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గంలో సబితను ఓడించాలంటే ఖచ్చితంగా ఆమెకు దీటైన నేతనే తీసుకురావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్లాన్ వేసింది. మహేశ్వరంలో అసలైన సిసలైన నాయకుడిని బరిలోకి దించుతోంది. ఆ నేత కనుక మహేశ్వరం నుంచి పోటీ చేస్తే సబితా ఇంద్రారెడ్డి కూడా తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అక్కడ పోటీ. ఇప్పటికే సబితా రెడ్డికి వ్యతిరేకంగా ఆ నేత ఒకప్పుడు పోటీ చేసిన వ్యక్తే. ఇప్పుడు కాదు రెండు దశాబ్దాల కిందనే సబితకు అసలైన పోటీ ఇచ్చిన ఆ నేత మళ్లీ 2023 ఎన్నికల్లో సబితకు పోటీగా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన 23 ఏళ్ల కిందనే సబితారెడ్డికి పోటీగా ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికే కాంగ్రెస్ పెద్దలు లక్ష్మారెడ్డిని ఢిల్లీకి పిలిచారట. 2000 లో జరిగిన ఉపఎన్నికల్లో ఇంద్రారెడ్డి స్థానంలో సబితా రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చేవెళ్లి నుంచి సబితారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొన్నది. సబితా రెడ్డి గెలిచినా కూడా లక్ష్మారెడ్డి అప్పట్లోనే ఆమెకు గట్టి పోటీనిచ్చారు. అందుకే మరోసారి సబితా రెడ్డిని ఢీకొట్టడానికి లక్ష్మారెడ్డి అయితేనే కరెక్ట్ అని భావించి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నుంచి లక్ష్మారెడ్డిని బరిలోకి దించుతోంది. చూడాలి మరి.. మహేశ్వరంలో ఎవరు నెగ్గబోతున్నారో?
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
This website uses cookies.