
Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్పై అందరి దృష్టి.. గతంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!
Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన BJP బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది.
Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్పై అందరి దృష్టి.. గతంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!
గతంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్లో 5 ఫలితాలు నిజం కావడం మనం చూశాం. ఇక2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ అది అంత ప్రభావం చూపలేదుఏ. ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది.
బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.