Home » News » Delhi Exit Polls 2025 What 2015 And 2020 Predictions
News

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 5, 2025 9:04 pm
Advertisement

Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన BJP బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది.

Advertisement

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Delhi Exit Polls 2025 ఎగ్జిట్ పోల్స్‌పైనే ఆస‌క్తి..

గ‌తంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత వ‌ర‌కు నిజం అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్‌కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్‌లో 5 ఫలితాలు నిజం కావ‌డం మ‌నం చూశాం. ఇక‌2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ అది అంత ప్ర‌భావం చూప‌లేదుఏ. ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది.

Advertisement

బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి