
Pension : కొత్త ప్రభుత్వంలో ఇంటింటికి ఫించను ఉన్నట్టా.. లేనట్టా..!
Pension : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ ప్రభుత్వంపై భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాలనని ఎలా సాగించాలి అనే దానిపై కసరత్తులు చేస్తుంది. అయితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పించన్లు పంపిణీ సహా అనేక ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని.. వారికి పింఛన్ అందించేవారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ అడ్డుకోవాలని కోరుతూ.. చంద్రబాబు అండ్ కో ఎన్నికల సంఘాన్ని కోరారు. దాంతో కొద్ది రోజల నుంచి పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది.
అయితే జూలై నెలలో సామాజిక భద్రతా పించన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వాటి కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఈ సారి కూడా ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం ఏప ప్రభుత్వం ఇంకా వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టకపోవడమే. గతంలో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే జూలై 1న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతను తీసుకుం టామని చెప్పుకొచ్చారు. వలంటీర్ల ద్వారా నే పించన్లు పంపిణీ చేస్తా మన్నారు. ఇక, పింఛన్ల పెంపు అంశంపై మాత్రం అంతర్మథనం చెందుతున్నా.. సొమ్ములు సమకూర్చా లని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించినా.. ఇంటింటికీ పంపిణీ చేసే విషయంలో మాత్రం కాస్త సంశయిస్తున్నారు.
Pension : కొత్త ప్రభుత్వంలో ఇంటింటికి ఫించను ఉన్నట్టా.. లేనట్టా..!
పించన్లు ఇచ్చేందుకు కేవంలం ఆరు రోడుల సమయం మాత్రమే ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఉన్నవారిని కొనసాగిస్తారా, లేకుంటే కొత్త వారిని తీసుకుంటారా అనే దానిపై క్లారిటీ లేదు. పాత వారి నుంచి దరఖాస్తులు తీసుకుని స్క్రూటినీ చేసుకుని.. నియామ కాలు చేపట్టేందుకు ఎంత లేదన్నా.. వారం రోజులు పడుతుంది కాబట్టి వచ్చే నెల ఇంటింటికి పించన్ల అందిచండం కాస్త కష్టతమరమైన పనే అంటున్నారు. ఇప్పుడు ఎలాగు అలవాటు పడ్డారు కాబట్టి మెల్లగా ప్రభుత్వం ఇంటింటికి పించన్లకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి.
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
This website uses cookies.