PM Kisan : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
పీఎం కిసాన్ రైతుల అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యేది ఎప్పుడంటే..!!
పీఎం కిసాన్ డబ్బులు పడేది అప్పుడే
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత కలిగిన రైతులకు రూ. 6,000 చొప్పున మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే 19వ విడతగా రూ. 2,000 చొప్పున డబ్బులు ఫిబ్రవరి 2025లో రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇక రాబోయే 20వ విడత మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 9.88 కోట్ల మంది రైతులకు ఈ సౌభాగ్యం చేకూరనుంది.

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్..!
PM Kisan : పీఎం కిసాన్ రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే !!
అయితే ఈ డబ్బులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు, ధృవీకరణలు తప్పనిసరి. ముఖ్యంగా e-KYC పూర్తిచేయడం ప్రతి లబ్ధిదారుడికీ కచ్చితంగా అవసరం. లేకపోతే డబ్బు రాకపోవచ్చు. e-KYC ప్రక్రియను మీరు మీ దగ్గరలోని CSC సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ద్వారా పూర్తి చేయవచ్చు. అంతేగాక మీ భూమి పత్రాల్లో మీ పేరు తప్పకుండా ఉండాలి. ల్యాండ్ రికార్డులు అప్డేట్ చేయకపోతే, పథకానికి అనర్హులవుతారు. కొన్ని రాష్ట్రాల్లో రైతు రిజిస్ట్రీ వ్యవస్థలో పేర్లు నమోదు చేయడం కూడా అవసరం.
ఇక డబ్బులు వచ్చే బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే మీ అకౌంట్ NPCI సిస్టమ్లో మ్యాప్ అయి ఉందో లేదో బ్యాంకును సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఒక్కోసారి టెక్నికల్ లోపాలు లేదా డాక్యుమెంట్ల లోపాలతో డబ్బులు ఆగిపోతాయి. అలాంటి సందర్భాల్లో మీరు పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్లి ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ఈ సూచనలను పాటించటం ద్వారా వచ్చే విడత మొత్తాన్ని నిర్దిష్టంగా పొందవచ్చు. రైతులు అప్రమత్తంగా ఉండి తమ డాక్యుమెంట్లను సమర్థంగా నిర్వహించుకోవడం అవసరం.