ias vijay kumar join in ysrcp Ys jagan offered mp seat
YS Jagan : అధికార పార్టీ వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఇంకో 18 నెలల్లో ఏపీలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో త్వరలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొత్త ఓటర్లకు కూడా నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలి. ఓటర్ల నమోదు ప్రక్రియపై టీడీపీ, వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో ఇవే రెండు ప్రధాన పార్టీలు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనేపథ్యంలో వైసీపీ ముందే తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని వైసీపీ తాజాగా ప్రకటించింది. ఇక.. ఆయన గెలుపును వైపీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కావడం, కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికను సీఎం జగన్ చాలెంజ్ గా తీసుకున్నారు.ఏపీలో చాలా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. కానీ.. అవి కేవలం ఒక సెక్టార్ ప్రజలకే అందుతున్నాయని, నిరుద్యోగుల గురించి,
graduate mlc elections to be held in ap soon
ఉద్యోగాల ప్రకటనల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా చేజిక్కించుకుంటుందో వేచి చూడాలి. చాలామంది నిరుద్యోగులు ఈ విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుండటంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుంది అనేది చాలెంజింగ్ గానే ఉంటుంది. అందుకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. కొత్త ఓటర్ల చేర్పులు మార్పులు, పార్టీ నేతల మధ్య సమన్వయం విషయంపై పార్టీ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు మాత్రం అధికార వైసీపీకి అతి పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి. అయితే.. సీఎం జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.