Janasena : బీజేపీతో తెగదెంపులకు జనసేన సిద్దమైందా..? అసలేమీ జరుగుతుంది..?

Advertisement
Advertisement

Janasena : 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆలస్యం చేయకుండా బీజేపీతో జతకట్టి కీలకమైన కూటమిగా ఏర్పడ్డాడు. వచ్చే ఎన్నికల దాక ఇద్దరి కలిసి ప్రయాణం చేయాలనీ అనుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పాడు, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అతి త్వరలోనే బీజేపీ – జనసేన పొత్తు బంధం తెగిపోయేలా కనిపిస్తుంది.

Advertisement

Janasena : విశాఖ ఉక్కు.. జనసేనకు చిక్కు

రాష్ట్రంలో ఎలాంటి సమస్య తెర మీదకు వచ్చిన నేను ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చేవాడు. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్న కానీ, దానిపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేదు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోందన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది.

Advertisement

janasena ready to quit bjp In AP

ఢిల్లీ దాకా వెళ్లి కేంద్ర పెద్దలను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరిన పవన్ కళ్యాణ్ , వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు.అందుకు కారణం జనసేన కు బీజేపీతో ఉన్న పొత్తేనని తెలుస్తోంది. మరోపక్క బిజెపి నేతలు సైతం కేంద్ర పెద్దల నిర్ణయంతో ఒకింత అసహనంతో ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.

గతంలో అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, కేంద్రంతో మాట్లాడి రాజధాని తరలింపు ఆపడానికి ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినప్పటికీ, మూడు రాజధానులు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర తేల్చిచెప్పింది. అప్పుడే పవన్ కళ్యాణ్ మాట కేంద్ర పెద్దల వద్ద చెల్లలేదనేది చర్చ జరిగింది.

మరోవైపు బీజేపీ తీరుతో పవన్ కల్యాణ్ అంత సంతృప్తిగా లేరనే మాట వినిపిస్తోంది. పొత్తు ధర్మమంటూ లేకుండా సొంత ఎజెండాతో రాజకీయాలు చేసుకుంటుంటే ఇక పొత్తులు ఉంది ఏమి లాభం అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ ఆలోచనలకూ ఒక రూపం వస్తే బీజేపీతో పొత్తు కు స్వస్తి చెప్పినట్లే అంటూ రాజకీయ నిపుణులు చెపుతున్న మాట.. బహుశా బీజేపీకి దూరం జరిగి, టీడీపీకి దగ్గరవుతాడేమో జనసేనాని..

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

11 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

1 hour ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

2 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

12 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

13 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

14 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

15 hours ago

This website uses cookies.