Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీ ప్రచారం.. ఏ పార్టీ తరఫున అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీ ప్రచారం.. ఏ పార్టీ తరఫున అంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీ ప్రచారం.. ఏ పార్టీ తరఫున అంటే..?

Kumari Aunty : హాయ్.. నాన.. చెప్పండి ఏం కావాలి అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉన్న ఆమెను కొంతమంది సోషల్ మీడియా ఫుడ్ వ్లాగ్ చేసే వాళ్లు వెళ్లి వీడియోలు తీశారు. అవి కాస్తా ఫేమస్ కావడంతో ఆమె ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. మరీముఖ్యంగా ఆమె చెప్పి.. మీది మొత్తం తౌజెండ్ అయింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా అనే డైలాగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. దాంతో ఒక్కసారిగా ఆమెపై మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వచ్చేశాయి. దాంతో దెబ్బకు ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

Kumari Aunty : పబ్లిక్ ను కంట్రోల్ చేయలేక..

ఎంతలా అంటే ఆమె ఫుడ్ బిజినెస్ ఒక్కసారిగా ఫైవ్ స్టార్ హోటళ్లకు కూడా షాక్ ఇచ్చేంతగా గిరాకీ వచ్చేసింది. ఆమె బిజినెస్ ముందు పబ్లిక్ ను కంట్రోల్ చేయలేక పోలీసులే ఇబ్బందులు పడ్డారు. అంతగా ఫేమస్ అయిన ఆమె మీద అప్పట్లో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ఆమె మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులు ఆమె ఫుడ్ బిజినెస్ మూసేయాల్సి వచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డి స్వయంగా కలుగ జేసుకుని ఆమె బిజినెస్ ను రీ ఓపెన్ చేయించారు. అప్పటి నుంచి ఆమె బిజినెస్ బాగానే జరుగుతోంది. ఇక మధ్యలో ఆమె చాలానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో ఇంకా ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమెను ఏపీ రాజకీయాల్లోకి కూడా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆమెను గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తరఫున ప్రచారం చేయించారు. ఆమె మాట్లాడుతూ పదేండ్లుగా గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ తెలిపారు.

Kumari Aunty ఏపీలో కుమారి ఆంటీ ప్రచారం ఏ పార్టీ తరఫున అంటే

Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీ ప్రచారం.. ఏ పార్టీ తరఫున అంటే..?

రాముకు ఓటేసి గెలిపించాలని కోరారు. అయితే ఆమె గతంలో జగన్ మోహన్ రెడ్డి వల్లే తనకు సొంత ఇల్లు వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక రకంగా వైసీపీకి షాక్ అంటున్నారు. టీడీపీ తరఫున ఆమె ప్రచారం చేయడం అంటే ఇది ఒక రకంగా కూటమికి ప్లస్అ వుతుందని అంటున్నారు. అయితే ఓటర్లను ప్రభావితం చేసేంత సీన్ కుమారీ ఆంటీకి ఉందా లేదా అనేది ఇక్కడ ఆలోచించాలి. మరి ఆమె ఏ మేరకు ఓట్లను తెప్పిస్తుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది