Telangana Congress : తెలంగాణలో ఎన్నికల హడావుడి వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ తెలంగాణలో కాస్త జోరుమీదనే ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ 119 మంది అభ్యర్థులను రెడీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీ అయింది స్క్రీనింగ్ కమిటీ. వరుస భేటీలను నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులను సెలెక్ట్ చేసేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. 80 మంది పేర్ల జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అందించిందట. మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపికపై కాస్త గందరగోళం నెలకొన్నది. బీఆర్ఎస్ లో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు అసంతృప్త నేతలను ఇప్పటికే కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకుంటోంది. బీఆర్ఎస్ లో అసంతృప్తిలో ఉన్న నేతలు కాంగ్రెస్ పిలుపు మేరకు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల టీకాంగ్రెస్ లోకి భారీగా చేరికలు పెరిగాయి. నేతల చేరికలపై దృష్టి పెడుతూనే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేస్తోంది. ఇప్పటికే 80 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. త్వరలోనే మిగితా అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ముందు 80 మంది అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినా.. ఒకేసారి 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ప్రకటించి వెంటనే ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం. ఇతర పార్టీల నుంచి నేతలు చేరడం, వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో.. సీనియర్ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారు. దీంతో వాళ్లను బుజ్జగిస్తూనే ఇతర పార్టీ నేతలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ కోసమే పని చేయాలని.. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు దక్కుతాయని హైకమాండ్ భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.