Modi : వచ్చే వారంలో ఏపీకి ప్రధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబడులు ?
Modi : ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu , ప్రధాని మోదీ Pm Modi మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడం మనం చూశాం. శుక్రవారం మధ్నహ్నం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం కేంద్ర గ్రాంటుగా ఇస్తుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల కాల పరిమితి తో రుణం ఖరారైంది. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు.
నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్తో పాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కారణంగా వచ్చే నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Modi : వచ్చే వారంలో ఏపీకి ప్రధాని మోదీ.. రూ.80 వేల కోట్ల పెట్టుబడులు ?
విశాఖలోని పూడిమడకలో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 84,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫాక్చరింగ్ జోన్లు వస్తాయని… విండ్, సోలార్ హైబ్రిడ్ పంప్డ్ స్టోరేజీకి కావాల్సిన 20 గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టులో ఏపీ జెన్కోకు 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి కూడా చంద్రబాబు వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి రానున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కూడా మోదీ చేతుల మీదుగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
This website uses cookies.