Mohan Babu : చంద్రబాబు, బాలయ్య కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకొని మోసం చేశారు.. మోహన్ బాబు ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mohan Babu : చంద్రబాబు, బాలయ్య కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకొని మోసం చేశారు.. మోహన్ బాబు ఫైర్

Mohan Babu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని కొందరంటే.. సక్రమమే అని మరికొందరు అంటున్నారు. టీడీపీ నేతలు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు అయితే బేషరతుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. నందమూరి కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 October 2023,4:00 pm

Mohan Babu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని కొందరంటే.. సక్రమమే అని మరికొందరు అంటున్నారు. టీడీపీ నేతలు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు అయితే బేషరతుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. నందమూరి కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు కానీ.. మోహన్ బాబు మాత్రం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు, బాలయ్య ఇద్దరూ కలిసి మోసం చేశారంటూ చెప్పుకొచ్చారు.

చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. చంద్రబాబు గురించి తనకే ఎక్కువగా తెలుసని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు దిట్ట అని.. పుట్టుకతోనే చంద్రబాబు అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. అసలు టీడీపీ పార్టీ ఎవరిది.. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది. సినిమా రంగాన్ని వదిలేసి మరీ.. రాజకీయాల్లో వచ్చి టీడీపీని స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు. భారతదేశంలోనే టీడీపీకి ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు ఈయనకు కన్యాదానం చేస్తే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు.

mohan babu fires on balakrishna and chandrababu arrest

#image_title

Mohan Babu : ఎవ్వరినైనా కరివేపాకులా తీసే గుణం చంద్రబాబు సొంతం

చంద్రబాబు ఎవ్వరినైనా కరివేపాకులా తీసేస్తారని.. తనకు అవసరం ఉన్నంత సేపే ఎవ్వరినైనా వాడుకుంటారని.. ఆ తర్వాత ఎవ్వరైనా సరే కరివేపాకులా కూరలో నుంచి తీసిపారేస్తారని చెప్పుకొచ్చారు. వైస్రాయ్ హోటల్ కి ఎన్టీఆర్ వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడనీయకుండా టపటప ఆయన మీద చెప్పులు విసిరిన ఘనత చంద్రబాబుది. ఊసరవెల్లిలా మాటలు చెబుతాడు. అస్సలు చంద్రబాబును నమ్మొద్దు. నమ్మితే అడ్డంగా మోసపోవడం ఖాయం. అలా చాలామందిని చంద్రబాబు మోసం చేశారని.. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడుకొని వదిలేశారని.. ఎవరికి జనాల్లో బలం ఉంటే వాళ్లను వాడుకొని వదిలేస్తారని, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారని మోహన్ బాబు స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది