
Nageshwar Rao : పవన్ కళ్యాణ్పై నేను రాయి విసరలేదు.. అదంతా అసత్యం..!
Nageshwar Rao : ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హీటెక్కుతుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు రాళ్లదాడి చేసుకుంటున్నారు. శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఓ వ్యక్తి రాయి విసిరినట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తుండగా ఆయనపై రాయి విసిరారు. అయితే ఈ ఘటనలో పవన్కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్కు దూరంగా వెళ్లిపడడంతో ప్రమాదం తప్పింది. అయితే రాయి విసిరిన ఆగంతుకుణ్ణి జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులకి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి.
అయితే రాయి విసిరిన వ్యక్తి ఎవరు.. ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సమయంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది..పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయి విసిరిన మాట వాస్తవం కాదని పోలీసులకు చిక్కిన నాగేశ్వరావు తెలిపారు. నాగేశ్వరరావు ది గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి. తెనాలి కాగా, ఆయన పవన్ కల్యాణ్ పర్యటనకు రావటంతో ఆయన నుంచి షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో తన చేయి తగిలిందని, తనపై వారి బంధువులు దాడి చేయడంతో దాన్ని రాయి దాడిగా మార్చారాని నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. తన చేయి మహిళకు తగిలితే ఆ ఘటనను రాయి విసిరిన ఘటనగా మార్చేశారని ఆయన పోలీసులకి తెలియజేశారు. అయితే ఆయన చెప్పింది వాస్తవమేనని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు నాగేశ్వరరావును విచారించి వదిలేసినట్లు సమాచారం.. నిన్న తెనాలిలో పవన్ పై రాయి దాడి జరిగిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
Nageshwar Rao : పవన్ కళ్యాణ్పై నేను రాయి విసరలేదు.. అదంతా అసత్యం..!
ఇక ఇదిలా ఉంటే జగన్పై రాయి దాడి సంఘటపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. జగన్ రాయి దాడిలో డీజీపీ, ఇంటిలిజెన్స్ ఛీఫ్ను తొలగిచాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు?’’ అని నిలదీశారు.
Coconut Water : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…
Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
This website uses cookies.