
Nageshwar Rao : పవన్ కళ్యాణ్పై నేను రాయి విసరలేదు.. అదంతా అసత్యం..!
Nageshwar Rao : ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హీటెక్కుతుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు రాళ్లదాడి చేసుకుంటున్నారు. శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఓ వ్యక్తి రాయి విసిరినట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తుండగా ఆయనపై రాయి విసిరారు. అయితే ఈ ఘటనలో పవన్కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్కు దూరంగా వెళ్లిపడడంతో ప్రమాదం తప్పింది. అయితే రాయి విసిరిన ఆగంతుకుణ్ణి జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులకి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి.
అయితే రాయి విసిరిన వ్యక్తి ఎవరు.. ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సమయంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది..పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయి విసిరిన మాట వాస్తవం కాదని పోలీసులకు చిక్కిన నాగేశ్వరావు తెలిపారు. నాగేశ్వరరావు ది గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి. తెనాలి కాగా, ఆయన పవన్ కల్యాణ్ పర్యటనకు రావటంతో ఆయన నుంచి షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో తన చేయి తగిలిందని, తనపై వారి బంధువులు దాడి చేయడంతో దాన్ని రాయి దాడిగా మార్చారాని నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. తన చేయి మహిళకు తగిలితే ఆ ఘటనను రాయి విసిరిన ఘటనగా మార్చేశారని ఆయన పోలీసులకి తెలియజేశారు. అయితే ఆయన చెప్పింది వాస్తవమేనని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు నాగేశ్వరరావును విచారించి వదిలేసినట్లు సమాచారం.. నిన్న తెనాలిలో పవన్ పై రాయి దాడి జరిగిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
Nageshwar Rao : పవన్ కళ్యాణ్పై నేను రాయి విసరలేదు.. అదంతా అసత్యం..!
ఇక ఇదిలా ఉంటే జగన్పై రాయి దాడి సంఘటపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. జగన్ రాయి దాడిలో డీజీపీ, ఇంటిలిజెన్స్ ఛీఫ్ను తొలగిచాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు?’’ అని నిలదీశారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.