Pakistan : కవ్వింపు చర్యలకి దిగిన పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు..!
ప్రధానాంశాలు:
Pakistan : కవ్వింపు చర్యలకి దిగిన పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు..!
Pakistan : జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందిస్తుంది. అందులోభాగంగా సింధూ జలాలపై చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. పాకిస్థాన్ సైతం దాదాపుగా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.

Pakistan : కవ్వింపు చర్యలకి దిగిన పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు..!
Pakistan రెచ్చగొడుతున్న పాక్..
ఈ నిర్ణయం తీసుకొన్న కొన్ని గంటలకే.. అంటే శుక్రవారం తెల్లవారుజామున పాక్.. నియంత్రణ రేఖ వద్ద భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా భారత్ భూభాగంపైకి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం సైతం అదే స్థాయిలో స్పందించింది.. పాక్కు గట్టిగా బదులు ఇచ్చింది. అయితే ఈ కాల్పుల్లో భారతీయ సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత బలగాలపైకి కాల్పులు జరిపారు. అయితే శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటున్నది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తున్నది. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఆర్మీ చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. మన బలగాలు దానిని తిప్పికొట్టాయని చెప్పారు.