
Janasena : వారందరికి జనసేననే బెస్ట్ ఆప్షన్... అందుకు కారణం ఏంటంటే..!
Janasena : సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్ వస్తోంది. అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా జనసేనలోకి సరికొత్త ఉత్సాహం వస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను చేరిక లాంఛనం కాగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఈ చేరికలతో గ్లాస్ పార్టీ కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ బలోపేతం కానుండడం గమనార్హం. అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రితో సహా కొన్ని పదవులు పొందిన ఈ పార్టీ ఇక రాజకీయంగా బలోపేతంపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది.
జనసేన కూడా నెమ్మదిగా తన రాజకీయ వ్యూహాన్ని అదే దిశగా అమలు చేస్తూ పోతోంది. టీడీపీలో చేరాలని ఎవరైనా అనుకున్నా నాలుగు దశాబ్దాల పార్టీ , అందులో నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. అంతే కాదు ఆ పార్టీలో ఇప్పటికే హౌజ్ ఫుల్ గా ఉంది. ఇక వైసీపీని పార్టీగా కాకుండా ఒక కార్పొరేట్ సంస్థగా నడుపుతున్నారు అన్న విమర్శ ఉంది. దీంతో చాలా మంది జనసేనలో చేరడమే ఉత్తమంగా ఉంది అని అంటున్నారు. జనసేనలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ నియంత పోకడలు చూపించరు అని అంటున్నారు. మెగాభిమానులు కూడా జనసేనలో నాయకులకు అండగా ఉంటారు. యువత మహిళ అభిమానులు కూడా ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంటున్నాయి.
Janasena : వారందరికి జనసేననే బెస్ట్ ఆప్షన్… అందుకు కారణం ఏంటంటే..!
2026లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య బాగా పెరుగుతుంది. దాంతో ఇలా జనసేనలో చేరిన వారికి టికెట్లు దక్కుతాయని కూడా భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలు ఏమైనా మారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇక తిరుగేలేదు అని భావించే ముందు చూపు ఉన్న వారు కళ్ళు మూసుకుని జనసేనకు ఓటు వేస్తున్నారు. వీటికి మించి పవన్ కళ్యాణ్ దగ్గర తమకు గౌరవం ఉంటుందని ఆయన ఏమి చెప్పినా వింటారని కూటమిలో జనసేనకు ఉన్న ప్రాధాన్యత రిత్యా నామినేటెడ్ సహా కీలక పదవులు కూడా రానున్న కాలంలో అందుకోవచ్చు అని ఆశపడుతున్న వారు కూడా ఆ వైపు చూస్తున్నారు. జనసేన గాలానికి వైఎస్సార్సీపీ చిక్కి విలవిలలాడుతోంది. దసరాలోపు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో వైఎస్సార్సీపీ నాయకులు వరుసగా సమావేశమవుతున్నారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.