Pawan Kalyan : ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అయినా ప్రజలకు సేవ చేయడమే.. దాన్నే పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతాడు. తాజాగా ఆయన పొత్తు విషయంపై, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. నేను పొత్తు చేయాలనుకుంటే ఓపెన్ గా చెప్పేస్తాను.. అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ ఇది అభియోగం అంటూ చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలో అవినీతి పరుడు ఎవరు అంటే 29 కేసులు ఉన్న ముఖ్యమంత్రి జగన్ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు ఏదైనా బీజేపీతో సమస్య ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుతూ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మేము 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు.. అన్నారు.
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్లంతా నటులు. వాళ్లు పొలిటికల్ హీట్ ను తీసుకోలేరు. వాళ్లకు వంద సమస్యలు ఉంటాయి. వాళ్లకు ఎలాంటి అభిప్రాయాలు లేవా అనడం కరెక్ట్ కాదు కానీ.. వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బయటికి రాకపోవడానికి కారణం వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందుకే వాళ్లు బయటికి రావడం లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మీద చాలామంది సినిమాలు తీశారు. కోట శ్రీనివాసరావు గారు తీశారు.. పృథ్వీ గారు కూడా తీశారు. కానీ.. ఆయన పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్లు అంటూ పవన్ మండిపడ్డారు.
అదంతా ఎందుకు రజినీకాంత్ గారు.. ఒక సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అశేష అభిమానం ఉన్న వ్యక్తి. ఆయన చంద్రబాబు గారిని మాట వరుసకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిస్తే ఆయన్ను తిట్టని తిట్టు లేదు. వైసీపీ నేతలు రజినీకాంత్ ను కూడా టార్గెట్ చేసి తీవ్రంగా దూషించారు. ఆయనే డిఫెండ్ చేసుకోలేకపోయినప్పుడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు వైసీపీ నేతల నోళ్లలో పడకూడదని అనుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.