
prashanth kishore ipac company employees to visit ap villages
YS Jagan : 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ( YSRCP ) అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ప్రశాంత్ కిషోర్. ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఎన్నికల వ్యూహకర్త. 2019 ఎన్నికల కంటే ముందే జగన్ తో జతకట్టిన ప్రశాంత్ కిషోర్ ( prashant kishor ) .. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఐప్యాక్ అనే సంస్థ ప్రశాంత్ కిషోర్ దే. ఇప్పటికీ ఈ సంస్థ వైసీపీతో పని చేస్తోంది. అంతే కాదు.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ సంస్థ పనిచేసేది. ఇదివరకు టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య ఒప్పందం కుదిరింది కానీ.. ఇప్పుడు ఏమైందో తెలియదు. ఐప్యాక్ బృందం ప్రస్తుతం తెలంగాణను వదిలేసి ఏపీకి వెళ్లిపోయింది.
ఏపీలో పీకే బృందం విస్తృతంగా పర్యటించనుంది. ఎందుకంటే.. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఐప్యాక్ బృందం అలర్ట్ అయింది. ఇప్పటి వరకు ఐప్యాక్ సభ్యులు అంతా వెనుక ఉండి అంతా నడిపించారు. కానీ.. ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేరుగా ప్రజలను మాత్రమే కాదు.. మంత్రులను, ఎమ్మెల్యలను కూడా కలవనున్నారు. ప్రస్తుతం ప్రతి వారం ఐప్యాక్ సీఎం జగన్ కు నివేదిక అందజేస్తోంది.
prashanth kishore ipac company employees to visit ap villages
ఈనెల 15 నుంచి ఒక్కో ఐప్యాక్ సభ్యుడికి ఒక ఎమ్మెల్యేను అటాచ్ చేయబోతున్నారట. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్ షాప్ లో సీఎం జగన్ ఈ విషయాలను వెల్లడించారు. అందుకే.. ముందుగానే ఐప్యాక్ ప్రతినిధులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తమ పర్యటనలో ప్రజలతో మాట్లాడనున్నారు. ఆ ఫీడ్ బ్యాక్ ను సీఎం జగన్ కు అందిస్తారు. అలాగే రెస్పెక్టివ్ ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఆ నివేదికను అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వాళ్లతో చర్చిస్తారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేదాన్ని బట్టి ముందడుగు వేయనున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చాలా ప్లస్ కానున్నాయి. మొత్తానికి ఐప్యాక్ ప్రతినిధులు సీఎం జగన్ కు ఇప్పటి నుంచే చాలా హెల్ప్ చేస్తున్నారు. వైసీపీ నేతలకు చాలా సమయం కేటాయించి వాళ్లు గెలిచాలా కృషి చేయనున్నారు.
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
This website uses cookies.