
Revanth Reddy : ఏం ప్లాన్ బాస్.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న కత్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్రెడ్డి..!
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం పై న్యాయ విచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలపై బీఆర్ఎస్ నేతలు కోరిక మేరకు విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలే విచారణకు సవాల్ చేశారు. అదే అదనుగా భావించి రేవంత్ రెడ్డి విచారణ ప్రకటించేశారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఛతీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తాం అనఅన్నారు. ు దీనికి కారణం మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేయించుకోవాలని సవాల్ చేయడమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత విచారణ చేసుకోండి అని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ కాళేశ్వరం వద్దకు సభ్యులను తీసుకెళ్తామని ప్రకటించారు. దీనికి కవిత కాళేశ్వరం ఏమైనా టూరిస్ట్ ప్లేస్ నా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ బదులిస్తూ ప్రాజెక్టులో ఏం జరిగిందో సభ్యులతోపాటు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతే కాకుండా సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళేశ్వరం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలను బస్సులో కాళేశ్వరం తీసుకెళ్లి చూపించారు. అంతేకాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. కానీ పర్యాటక కళ రాకముందే మేడిగడ్డ కుంగింది. అన్నారానికి బుంగలు పడ్డాయి. విచారణలో ఏమి తేలుతుందో కానీ తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని, వారే విచారణకు డిమాండ్ చేసినందున విచారణ చేయించామని రేవంత్ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విచారణ చేయించుకోండి అని సవాల్ విసరడంతో విచారణ జరిపించి గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.