
Revanth Reddy : ఏం ప్లాన్ బాస్.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న కత్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్రెడ్డి..!
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం పై న్యాయ విచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలపై బీఆర్ఎస్ నేతలు కోరిక మేరకు విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలే విచారణకు సవాల్ చేశారు. అదే అదనుగా భావించి రేవంత్ రెడ్డి విచారణ ప్రకటించేశారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఛతీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తాం అనఅన్నారు. ు దీనికి కారణం మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేయించుకోవాలని సవాల్ చేయడమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత విచారణ చేసుకోండి అని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ కాళేశ్వరం వద్దకు సభ్యులను తీసుకెళ్తామని ప్రకటించారు. దీనికి కవిత కాళేశ్వరం ఏమైనా టూరిస్ట్ ప్లేస్ నా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ బదులిస్తూ ప్రాజెక్టులో ఏం జరిగిందో సభ్యులతోపాటు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతే కాకుండా సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళేశ్వరం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలను బస్సులో కాళేశ్వరం తీసుకెళ్లి చూపించారు. అంతేకాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. కానీ పర్యాటక కళ రాకముందే మేడిగడ్డ కుంగింది. అన్నారానికి బుంగలు పడ్డాయి. విచారణలో ఏమి తేలుతుందో కానీ తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని, వారే విచారణకు డిమాండ్ చేసినందున విచారణ చేయించామని రేవంత్ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విచారణ చేయించుకోండి అని సవాల్ విసరడంతో విచారణ జరిపించి గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నారు.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.