Surendra Moga : దేశ సేవ చేస్తూ నాన్న చనిపోవడం గర్వంగా ఉంది.. పాకిస్తాన్ లేకుండా చేయాలన్న కూతురు..!
ప్రధానాంశాలు:
Surendra Moga : దేశ సేవ చేస్తూ నాన్న చనిపోవడం గర్వంగా ఉంది.. పాకిస్తాన్ లేకుండా చేయాలన్న కూతురు..!
Surendra Moga : భారత్ , పాక్ ఉద్రిక్తతలు వేళ అమెరికా సహా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల అంగీకారంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ కాసేపటికే పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. దీంతో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆర్మీ జవాన్ మరణించారు.జమ్ములోని ఆర్ఎస్ పురా సెక్టార్లోని సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన సరిహద్దు కాల్పుల్లో BSF సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.

Surendra Moga : దేశ సేవ చేస్తూ నాన్న చనిపోవడం గర్వంగా ఉంది.. పాకిస్తాన్ లేకుండా చేయాలన్న కూతురు..!
Surendra Moga : పాకిస్తాన్ని అంతం చేయాలి..
అయితే ఇంతియాజ్ అవుట్ పోస్ట్ వద్ద ధైర్యంగా నాయకత్వం వహిస్తూ అత్యున్నత ప్రాణం త్యాగం చేశారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇక ఎయిర్ ఫోర్స్కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా కూడా ఈ దాడిలో కన్నుమూసారు. అయితే ఆయన పార్థివదేహం కొద్దిసేపటి క్రితం రాజస్థాన్లోని ఆయన స్వగ్రామానికి చేరింది. ఝున్ఝును జిల్లాలోని మాండవ సురేంద్ర మోగా స్వగ్రామం. మోగీ పార్థివదేహం స్వగ్రామానికి చేరిందని తెలియగానే పరిసర గ్రామాలకు చెందిన జనం భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అయితే నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది . వీరజవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా కూతురు అన్నారు. పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి..అతం చేయాలి. నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలి పెట్టను.. అందరిని అంతం చేస్తానంటూ మోగా కూతురు ఎమోషనల్తో అన్నారు.