Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,11:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తుంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి గారి సార‌ధ్యంలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లంధిస్తున్న‌ట్టుగా గుర్తు చేశారు. భార‌త రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం చేప‌ట్టిన జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

Mahesh Kumar Goud ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా చేప‌ట్టండి ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డికి సూచించి పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్‌

ఉప్ప‌ల్ నియోజ‌క‌వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి శ‌నివారం పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్‌ను క‌లిశారు. నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను గురించి ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పీసీసీ చీఫ్‌కు వివ‌రించారు. స‌న్న బియ్యం ప‌థ‌కం అమ‌లు, ల‌బ్ధిదారుల ఇళ్ల‌ల్లో బోజ‌నాలు, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌లు, త‌దిత‌ర వాటి గురించి చెప్పారు. దీంతో ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిని ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌కుమార్‌గౌడ్ గారు అభినందించారు.

ఇదే త‌ర‌హాలో ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని మ‌హేష్‌కుమార్‌గౌడ్ గారు,సూచించారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ‌, అభివృద్ది ప‌థ‌కాల విషయంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మాల‌లో భాగ‌స్వాములు కావాల‌ని సూచించారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ గారు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి బూపతి రెడ్డి గారు పాల్గొన్నారు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది