TDP : ట్రంప్ కి బుల్లెట్టు.. వైఎస్ జగన్ కి గులకరాయి.. సంచలనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : ట్రంప్ కి బుల్లెట్టు.. వైఎస్ జగన్ కి గులకరాయి.. సంచలనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు..!

TDP : అమెరికా ప్రెసిడెంట్ కి రెండోసారి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మీద దుండగులు కాల్పులు జరుపగా తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారన్న విషయం తెలిసిందే. ఐతే బుల్లెట్టు ఆయన చెవికి తగలడం వల్ల ట్రంప్ కి ఏమి కాలేదు.. ఒకవేళ ఆ బుల్లెట్ తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఐతే తన పై దుందగులు బుల్లెట్ తో టార్గెట్ చేసినా ట్రంప్ ఏమాత్రం భయపడకుండా నినాదం చేస్తూ హాస్పిటల్ కు వెళ్లారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్రంప్ కి తగిలిన బుల్లెట్ వైఎస్ జగన్ కి తగిలిన గులకరాయి సందర్భంతో పోల్చారు. ఐతే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ట్రంప్ కి అంత పెద్ద బుల్లెట్ తగిలినా పౌరుషంగా సిం హం నాదం చూపించారు. కానీ వైఎస్ జగన్ కి గులకరాయి తగిలిగేనే ప్రాణ భయంతో పిరికిపంద తత్వంతో కనిపించారని అన్నారు.

TDP వైఎస్ జగన్ పై గులకరాయితో దాడి..

2024 ఎన్నికల టైం లో సరిగ్గా ఎన్నికల ముందు విజయవాడ ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ మీద గులకరాయి దాడి జరిగింది. ఐతే ఆ దాడి వల్ల దాదాపు చాలా రోజులు జగన్ నుదుటి మీద ప్లాస్టర్ తో కనిపించారు. ఆ దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చారు. ఐతే ప్రస్తుతం ట్రంప్ పై జరిగిన బులెట్ట్ దాడిని ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిన్న గులకరాయి తగిలితేనే జగన్ పిరికిపంద లాగా ప్రాణ భయంతో కనిపించాడు.

TDP : ట్రంప్ కి బుల్లెట్టు.. వైఎస్ జగన్ కి గులకరాయి.. సంచలనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు..!

TDP : ట్రంప్ కి బుల్లెట్టు.. వైఎస్ జగన్ కి గులకరాయి.. సంచలనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు..!

ట్రంప్ పై బుల్లెట్ దాడి జరిగినా సరే సింహ నాదంతో కనిపించారు. నాయకత్వ లక్షణం అంటే అది అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు సోమిరెడ్డి. వైఎస్ జగన్ పై గులకరాయి దాడి అంతా అతను ఆడించిన నాటకమే అని టీడీపీ నేతలు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. సోమిరెడ్డి ట్రంప్ పై దాడిని ఉదహరిస్తూ జగన్ ఒక పిరికిపంద అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి