Pawan Kalyan : అక్కడ గెలిచి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ పట్టుదల ..!
Pawan Kalyan స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం..
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. జనసేన కూడా తన బలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పట్టణాలు, నగరాల్లో తనదైన ముద్ర వేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేనకు గోదావరి జిల్లాల్లో మంచి బలం ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోనూ పార్టీకి గణనీయమైన పట్టున్న ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఉత్తరాంధ్రలోని కీలక మున్సిపాలిటీలు, నగరాలపై జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. మూడు కార్పొరేషన్లలో కనీసం ఒకచోట తమ పార్టీ అభ్యర్థిని మేయర్గా కూర్చోబెట్టేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో ముఖ్యంగా విజయనగరం మేయర్ పీఠంపై జనసేన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు కార్పొరేషన్లలో విజయనగరం మేయర్ సీటును తమకు కేటాయించాలని కూటమిలో భాగస్వామి అయిన టీడీపీని కోరినట్లు ప్రచారం సాగుతోంది.
Pawan Kalyan : అక్కడ గెలిచి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ పట్టుదల ..!
Pawan Kalyan ఉత్తరాంధ్రలో సీట్లు పెంచుకోవడమే జనసేన టార్గెట్?
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జనసేన ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో, కూటమి పొత్తులో భాగంగా జనసేన ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. విశేషమేమిటంటే.. పోటీ చేసిన ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాలుగు స్థానాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక స్థానం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో నియోజకవర్గాన్ని జనసేన కైవసం చేసుకుంది. ఈ విజయాలతో ఉత్తరాంధ్రలో తమ పార్టీకి ఉన్న బలంపై జనసేనకు మరింత నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది.అయితే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఆరు స్థానాలతో సరిపెట్టుకోకుండా సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అంటే మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను అదనంగా తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదే సమయంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్పైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. గ్రేటర్ విశాఖపట్నం విషయంలో టీడీపీ వెనక్కి తగ్గే అవకాశం లేదని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం కార్పొరేషన్ కూడా కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడంతో.. తమకు అనుకూలంగా ఉండే విజయనగరం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని జనసేన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Pawan Kalyan విజయనగరంపై జనసేనకు ఎందుకంత ఫోకస్?
కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉన్న విజయనగరంలో క్రమంగా తమ రాజకీయ పట్టు పెంచుకోవాలన్నది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి విజయం సాధించడం కూడా పార్టీకి అక్కడ మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన అంశంగా భావిస్తున్నారు.అదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో విజయనగరం జిల్లాకు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తర్వాత విజయనగరం కీలక ప్రాంతంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడ తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం.కేవలం మేయర్ పదవితో ఆగకుండా.. విజయనగరంలో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నాయకత్వానికి కూడా తమ ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమిలో సీట్ల పంపకం ఎలా జరుగుతుందన్నది మాత్రం భవిష్యత్తులో తేలాల్సి ఉంది.ఇక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే.. 2021లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. అంతకుముందు ఇది మున్సిపాలిటీగా కొనసాగింది. కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైసీపీ అక్కడ జెండా ఎగురవేసింది. అయితే ఈసారి పరిస్థితిని మార్చాలని జనసేన పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు.. ప్రాంతంలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని జనసేన వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.మొత్తంగా చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జనసేన తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఉన్న బలాన్ని మరింత విస్తరించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది? విజయనగరం మేయర్ పీఠం జనసేనకు దక్కుతుందా? గతంలో వైసీపీ గెలిచిన ఈ కార్పొరేషన్లో ఈసారి జనసేన జెండా ఎగురుతుందా? అనేది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. Janasena, Pawan Kalyan, Vizianagaram, AP Local Elections, Andhra Pradesh







